ETV Bharat / state

''ఆ డాక్టర్లపై క్రిమినల్​ కేసులు ఎందుకు పెట్టలేదు?''

గద్వాలలో గర్భిణీకి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేసిన వైద్యులపై క్రిమినల్​ కేసులు ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విచారణలో భాగంగా ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.

author img

By

Published : May 27, 2020, 12:55 PM IST

high-court-verdict-on-gadwal-pregnant-lady-death
''ఆ డాక్టర్లపై క్రిమినల్​ కేసులు ఎందుకు పెట్టలేదు?''

ప్రసవం కోసం ఓ నిండు గర్భిణీ వందల కిలోమీటర్లు తిరిగింది. చివరకు వైద్యుల నిర్లక్ష్యంతో శిశువుతోపాటు కన్నుమూసింది. ఈ ఘటనపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. న్యాయవాదులు కిశోర్ కుమార్, శ్రీనిత లేఖ ఆధారంగా విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.

లాక్​డౌన్​లో ప్రసవాలు, అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించగా... నిర్లక్ష్యం చేసిన వైద్యులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. క్షేత్రస్థాయిలో ఆశించిన విధంగా చర్యలు ఉండటం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి పలు సూచనలు చేసేందుకు విశ్రాంత అధికారులతో కమిటీ వేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్​ 10కి వాయిదా వేసింది.

ప్రసవం కోసం ఓ నిండు గర్భిణీ వందల కిలోమీటర్లు తిరిగింది. చివరకు వైద్యుల నిర్లక్ష్యంతో శిశువుతోపాటు కన్నుమూసింది. ఈ ఘటనపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. న్యాయవాదులు కిశోర్ కుమార్, శ్రీనిత లేఖ ఆధారంగా విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.

లాక్​డౌన్​లో ప్రసవాలు, అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించగా... నిర్లక్ష్యం చేసిన వైద్యులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. క్షేత్రస్థాయిలో ఆశించిన విధంగా చర్యలు ఉండటం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి పలు సూచనలు చేసేందుకు విశ్రాంత అధికారులతో కమిటీ వేయాలని సూచించింది. తదుపరి విచారణను జూన్​ 10కి వాయిదా వేసింది.

ఇవీ చూడండి: 'వెయ్యి వెంటిలేటర్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.