ETV Bharat / state

'తొందరెందుకు... సోమవారం వరకు వేచిచూడండి'

author img

By

Published : Nov 9, 2019, 4:42 AM IST

Updated : Nov 9, 2019, 7:14 AM IST

" తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు సమ్మె కొనసాగిస్తున్నాయి. సమ్మెను చట్ట విరుద్ధమైందిగా ప్రకటించాలని యూనియన్లతో చర్చలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ మధ్య కాలంలో యూనియన్లలోనే కాకుండా ప్రజల్లోనూ ఆందోళన పెంచే నిర్ణయాన్ని మంత్రి మండలి తీసుకుంది. పరిస్థితి మరింత దిగజారకూడదు, సమస్య తీవ్రతరమయ్యే ఎలాంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోరాదు."                                 -  తెలంగాణ హైకోర్టు

'తొందరెందుకు... సోమవారం వరకు వేచిచూడండి'

ఆర్టీసీ విషయంలో పరిస్థితిని మరింత తీవ్రం చేసే ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ కార్మిక సమ్మె నేపథ్యంలో పరిస్థితి మరింత క్షీణించకుండా పర్మిట్​ల జారీకి సంబంధించిన నిర్ణయాన్ని సోమవారం వరకు తీసుకోరాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీలను ఆదేశించింది.

5,100 పర్మిట్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో తెలంగాణ డెమోక్రటిక్​ ఫోరమ్​ కన్వీనర్​ ప్రొ.విశ్వేశ్వరరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్​, జస్టిస్​ అభిషేక్​ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

అడ్వొకేట్​ జనరల్​ బీఎస్​ ప్రసాద్​ : 5,100 పర్మిట్​ల జారీకి సంబంధించి కౌంటరు దాఖలు చేశాం. సోమవారం విచారణ చేపట్టండి.

ధర్మాసనం : విచారణకు అనుమతిస్తాం.. కానీ మంత్రిమండలి తీర్మానంతో పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకు తదుపరి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వాలి.

ఏజీ : కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ తీసుకువచ్చింది, ఆ చట్టాన్ని అమలు చేస్తున్నాం

ధర్మాసనం : అంత తొందరెందుకు సోమవారం వరకు వేచి చూడండి.

ఏజీ : 5100 పర్మిట్​లను ప్రైవెటీకరిస్తూ.. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం చట్టానికి వ్యతిరేకం కాదు.

ధర్మాసనం : పలు చట్టాలకు వ్యతిరేకంగా మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని పిటిషనర్ ఆరోపించారు.

ఏజీ : మోటారు వాహనాల చట్టాన్ని పరిశీలించండి

ధర్మాసనం : దీనిపై సోమవారం విచారణ చేపడతాం

ఏజీ : మధ్యంతర ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నాం

ధర్మాసనం : కేబినెట్​ నిర్ణయం ఎక్కడ?

పిటిషనర్​ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ : నవంబర్​ 2న మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో వచ్చింది. తీర్మానం ప్రతి వెబ్​సైట్​లో పెట్టలేదు. అందువల్ల అది మాకు అందుబాటులో లేదు.

ఏజీ : మంత్రి మండలి తీర్మానం ప్రతి ప్రత్యేకమైనది(ప్రివిలైజ్​), అందువల్ల దాన్ని బహిర్గతం చేయలేం. మండలి తీర్మానాన్ని వెల్లడించాలంటూ ఏ నిబంధన కూడా చెప్పలేదు.

ధర్మాసనం : తీర్మానం చట్టబద్ధతను సవాలు చేస్తూ.. పిటిషన్​ దాఖలైంది. ఈ ప్రతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉన్నప్పటికీ, అది ప్రత్యేకమైనదైనప్పటికీ కోర్టు పరిశీలనకు ఇవ్వకుండా ఉండటానికి వీల్లేదు. కోర్టు ముంది ఏదీ ప్రత్యేకం కాదు. దాన్ని పరిశీలించకుండా చట్టబద్ధమో కాదో తేల్చడం సాధ్యం కాదు.

ఏజీ : మంత్రి మండలి నిర్ణయాన్ని ఒక పౌరుడు కోర్టులో ప్రశ్నించడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని సుప్రీం పేర్కొంది.

ధర్మాసనం : మా అవగాహన కోసం మంత్రి మండలి నిర్ణయాన్ని చూడాలనుకుంటున్నాం. ఒకవేళ ఈ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చని భావించినప్పుడే దాని చట్టబద్ధతను తేలుస్తాం.

ఏజీ : మంత్రి మండలి నిర్ణయాన్ని వెబ్​సైట్లో ఉంచరు. దాని ఆధారంగా జారీ చేసిన జీవోలనే అప్​లోడ్​ చేస్తారు.

ధర్మాసనం : మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం రహస్యం కానప్పుడు ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉంచరు? మంత్రి మండలి పనిచేసేదే ప్రజల కోసం, అది ప్రజల వాణి వినిపించడంలో భాగంగా వారికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ కేబినెట్..​ ప్రజల నుంచి ఏం దాచాలని ప్రయత్నిస్తోంది? కోర్టు ముందు ఏవీ దాచడానికి వీల్లేదు. దేశభద్రతకు సంబంధించినవి కూడా కోర్టు ముందు దాచడానికి వీల్లేదు.

ధర్మాసనం : తీర్మాన ప్రతిని ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పజాలదు. అలా అయితే అది వారికి వ్యతిరేకంగా ఉందని భావించాల్సి వస్తుంది. ఎవిడెన్స్​ చట్టంలోని సెక్షన్ 114 ప్రకారం వ్యతిరేక సాక్ష్యంగా పరిగణించాల్సి ఉంటుంది.

ఏజీ : అయితే ఉత్తర్వులు జారీ చేయండి.

వాదనలు పూర్తయ్యాక... ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పరిస్థితిని మరింత తీవ్రం చేసేలా నిర్ణయం తీసుకోరాదంటూ ధర్మాసనం విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

ఆర్టీసీ విషయంలో పరిస్థితిని మరింత తీవ్రం చేసే ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ కార్మిక సమ్మె నేపథ్యంలో పరిస్థితి మరింత క్షీణించకుండా పర్మిట్​ల జారీకి సంబంధించిన నిర్ణయాన్ని సోమవారం వరకు తీసుకోరాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీలను ఆదేశించింది.

5,100 పర్మిట్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో తెలంగాణ డెమోక్రటిక్​ ఫోరమ్​ కన్వీనర్​ ప్రొ.విశ్వేశ్వరరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్​, జస్టిస్​ అభిషేక్​ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

అడ్వొకేట్​ జనరల్​ బీఎస్​ ప్రసాద్​ : 5,100 పర్మిట్​ల జారీకి సంబంధించి కౌంటరు దాఖలు చేశాం. సోమవారం విచారణ చేపట్టండి.

ధర్మాసనం : విచారణకు అనుమతిస్తాం.. కానీ మంత్రిమండలి తీర్మానంతో పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకు తదుపరి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వాలి.

ఏజీ : కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ తీసుకువచ్చింది, ఆ చట్టాన్ని అమలు చేస్తున్నాం

ధర్మాసనం : అంత తొందరెందుకు సోమవారం వరకు వేచి చూడండి.

ఏజీ : 5100 పర్మిట్​లను ప్రైవెటీకరిస్తూ.. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం చట్టానికి వ్యతిరేకం కాదు.

ధర్మాసనం : పలు చట్టాలకు వ్యతిరేకంగా మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని పిటిషనర్ ఆరోపించారు.

ఏజీ : మోటారు వాహనాల చట్టాన్ని పరిశీలించండి

ధర్మాసనం : దీనిపై సోమవారం విచారణ చేపడతాం

ఏజీ : మధ్యంతర ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నాం

ధర్మాసనం : కేబినెట్​ నిర్ణయం ఎక్కడ?

పిటిషనర్​ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ : నవంబర్​ 2న మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో వచ్చింది. తీర్మానం ప్రతి వెబ్​సైట్​లో పెట్టలేదు. అందువల్ల అది మాకు అందుబాటులో లేదు.

ఏజీ : మంత్రి మండలి తీర్మానం ప్రతి ప్రత్యేకమైనది(ప్రివిలైజ్​), అందువల్ల దాన్ని బహిర్గతం చేయలేం. మండలి తీర్మానాన్ని వెల్లడించాలంటూ ఏ నిబంధన కూడా చెప్పలేదు.

ధర్మాసనం : తీర్మానం చట్టబద్ధతను సవాలు చేస్తూ.. పిటిషన్​ దాఖలైంది. ఈ ప్రతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉన్నప్పటికీ, అది ప్రత్యేకమైనదైనప్పటికీ కోర్టు పరిశీలనకు ఇవ్వకుండా ఉండటానికి వీల్లేదు. కోర్టు ముంది ఏదీ ప్రత్యేకం కాదు. దాన్ని పరిశీలించకుండా చట్టబద్ధమో కాదో తేల్చడం సాధ్యం కాదు.

ఏజీ : మంత్రి మండలి నిర్ణయాన్ని ఒక పౌరుడు కోర్టులో ప్రశ్నించడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని సుప్రీం పేర్కొంది.

ధర్మాసనం : మా అవగాహన కోసం మంత్రి మండలి నిర్ణయాన్ని చూడాలనుకుంటున్నాం. ఒకవేళ ఈ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చని భావించినప్పుడే దాని చట్టబద్ధతను తేలుస్తాం.

ఏజీ : మంత్రి మండలి నిర్ణయాన్ని వెబ్​సైట్లో ఉంచరు. దాని ఆధారంగా జారీ చేసిన జీవోలనే అప్​లోడ్​ చేస్తారు.

ధర్మాసనం : మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం రహస్యం కానప్పుడు ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉంచరు? మంత్రి మండలి పనిచేసేదే ప్రజల కోసం, అది ప్రజల వాణి వినిపించడంలో భాగంగా వారికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ కేబినెట్..​ ప్రజల నుంచి ఏం దాచాలని ప్రయత్నిస్తోంది? కోర్టు ముందు ఏవీ దాచడానికి వీల్లేదు. దేశభద్రతకు సంబంధించినవి కూడా కోర్టు ముందు దాచడానికి వీల్లేదు.

ధర్మాసనం : తీర్మాన ప్రతిని ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పజాలదు. అలా అయితే అది వారికి వ్యతిరేకంగా ఉందని భావించాల్సి వస్తుంది. ఎవిడెన్స్​ చట్టంలోని సెక్షన్ 114 ప్రకారం వ్యతిరేక సాక్ష్యంగా పరిగణించాల్సి ఉంటుంది.

ఏజీ : అయితే ఉత్తర్వులు జారీ చేయండి.

వాదనలు పూర్తయ్యాక... ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పరిస్థితిని మరింత తీవ్రం చేసేలా నిర్ణయం తీసుకోరాదంటూ ధర్మాసనం విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

Intro:Body:Conclusion:
Last Updated : Nov 9, 2019, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.