ETV Bharat / state

భాగ్యనగరంలో భారీ వర్షం.. కాలనీలు జలమయం

author img

By

Published : Oct 20, 2020, 7:25 PM IST

భాగ్యనగరంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివాసాల్లోకి వరదనీరు చేరడం వల్ల తాగడానికి మంచినీరు, తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు.

heavy rain in saroornagar in hyderabad
భారీ వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు

హైదరాబాద్ నగరంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రధాన రహదారులు, కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసారాంబాగ్‌-అంబర్ పేట్​కు వెళ్లే వంతెన రోడ్డును, గడ్డి అన్నారం నుంచి సరూర్​నగర్ మినీ ట్యాంక్ బండ్, సైదాబాద్ , సరస్వతి నగర్ , శివగంగ రోడ్డు, ఐఎస్‌ సదన్‌కు వెళ్లే రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు.

సరూర్​నగర్​ చెరువు లోతట్టు ప్రాంతాలైన గడ్డి అన్నారం , శారదా నగర్, కోదండరాం నగర్, పీ అండ్ టీ కాలనీల్లో నివాసాలలోకి వరద నీరు చేరడం వల్ల తాగడానికి మంచినీరు, తినడానికి తిండి లేక రాత్రి నుంచి వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

కర్మన్​ఘాట్, గ్రీన్​పార్క్ కాలనీ, ఐఎస్​ సదన్​ డివిజన్​, సింగరేణి కాలనీ , రెడ్డి కాలనీవాసులు ఇళ్లలోనే ఉండిపోయారు. అపార్టుమెంట్​ వాసులకు ట్రాక్టర్ ద్వారా అల్పాహారం అందించారు. తమ గోడు పట్టించుకునే వారే కరవయ్యారని కోదండరాం నగర్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. చంపాపేట్ డివిజన్ రాజ్​రెడ్డి కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడం వల్ల కొంత మంది ఇళ్లు వదిలిపెట్టి వెళ్లగా... మరికొంత మంది స్థానిక ఫంక్షన్​హాళ్లలో తలదాచుకున్నారు.

ఇవీ చూడండి: దెబ్బతిన్న ఇళ్లకు దసరా తర్వాత పరిహారం: కేటీఆర్​

హైదరాబాద్ నగరంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రధాన రహదారులు, కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసారాంబాగ్‌-అంబర్ పేట్​కు వెళ్లే వంతెన రోడ్డును, గడ్డి అన్నారం నుంచి సరూర్​నగర్ మినీ ట్యాంక్ బండ్, సైదాబాద్ , సరస్వతి నగర్ , శివగంగ రోడ్డు, ఐఎస్‌ సదన్‌కు వెళ్లే రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు.

సరూర్​నగర్​ చెరువు లోతట్టు ప్రాంతాలైన గడ్డి అన్నారం , శారదా నగర్, కోదండరాం నగర్, పీ అండ్ టీ కాలనీల్లో నివాసాలలోకి వరద నీరు చేరడం వల్ల తాగడానికి మంచినీరు, తినడానికి తిండి లేక రాత్రి నుంచి వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

కర్మన్​ఘాట్, గ్రీన్​పార్క్ కాలనీ, ఐఎస్​ సదన్​ డివిజన్​, సింగరేణి కాలనీ , రెడ్డి కాలనీవాసులు ఇళ్లలోనే ఉండిపోయారు. అపార్టుమెంట్​ వాసులకు ట్రాక్టర్ ద్వారా అల్పాహారం అందించారు. తమ గోడు పట్టించుకునే వారే కరవయ్యారని కోదండరాం నగర్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. చంపాపేట్ డివిజన్ రాజ్​రెడ్డి కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడం వల్ల కొంత మంది ఇళ్లు వదిలిపెట్టి వెళ్లగా... మరికొంత మంది స్థానిక ఫంక్షన్​హాళ్లలో తలదాచుకున్నారు.

ఇవీ చూడండి: దెబ్బతిన్న ఇళ్లకు దసరా తర్వాత పరిహారం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.