నాలెడ్జ్ సిటీలో డీఎల్ఎఫ్కు కేటాయించిన భూములు అక్రమంగా మై హోం గ్రూప్కు చేరాయంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, ఇతర ప్రతివాదులను హైకోర్టు మరో సారి ఆదేశించింది. చట్టప్రకారమే కేటాయింపులు జరిగాయని ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున సంస్థ డైరెక్టర్ జూపల్లి శ్యాంరావు కోర్టుకు నివేదించారు.
నాలెడ్జ్ హబ్ కోసం టీఎస్ఐఐసీకి ప్రభుత్వం 414 ఎకరాలు కేటాయించగా.. అందులోని 140 ఎకరాల్లో ఐటీ, వాణిజ్యం, వినోదం తదితర నిర్మాణాల కోసం టెండర్లు పిలిచారని హైకోర్టుకు సమర్పించిన కౌంటరులో వివరించారు. అందులో 31 ఎకరాలను డీఎల్ఎఫ్ సంస్థ సుమారు రూ. 580 కోట్లతో దక్కించుకుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం డీఎల్ఎఫ్ రాయ్ దుర్గ్ డెవలపర్స్ ప్రాజెక్టు లిమిటెడ్ అనే ఎస్పీవీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఆ తర్వాత దాని పేరు ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చి ఆర్వీసీ నివేదికను సమర్పించినట్లు శ్యాంరావు వెల్లడించారు. సర్వే నెంబరు 83/1 లో పురావస్తు నిర్మాణాలు ఉండటం వల్ల అదే సర్వే నెంబరులో ప్రత్యామ్నాయ భూములను అప్పగించాలని కోరగా టీఎస్ఐఐసీ అంగీకరించిందని వివరించారు. గతంలోనే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించినందున.. ప్రత్యామ్నాయ భూమికి మినహాయించాలని కోరగా అంగీకరించారన్నారు.
నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆయాచిత ప్రయోజనాలు పొందలేదని.. అవాస్తవాలతో కూడిన పిటిషన్ను కొట్టివేయాలని ఆక్వా స్పేస్ డెవలప్ మెంట్ సంస్థ హైకోర్టును కోరింది.
ఇదీ చదవండి: న్యూ ఇయర్ గిఫ్ట్: బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి