బీసీ గురుకులాల్లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను mjptbcwreis.cgg.gov.in వెబ్ సైట్లో చూడవచ్చునని బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు.
ఎంపికైన వారికి త్వరలో ఆయా జిల్లాల గురుకులాల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కౌన్సిలింగ్ వివరాలు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామన్నారు.
ఇదీ చదవండి: కేసీఆర్ స్ఫూర్తితో ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి: పవన్