పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతులు వాహన్ రావు, నాగమణిల హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకేసులో విచారణ వేగవంతం చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
జరిగిన ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులకు తగిన శిక్ష పడేలా చూడాలని తమిళిసై లేఖలో ప్రభుత్వానికి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక పంపాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ను పరామర్శించిన సీఎం