ETV Bharat / state

కరోనా మృతుల కుటుంబాలకు కారుణ్య నియామకానికి ఏపీ ప్రభుత్వం అనుమతి - ap govt permission for compassionate appointment

కరోనా మృతుల కుటుంబాల్లో అర్హూలైన వారికి ఉద్యోగం కల్పించాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరణించిన ఉద్యోగి పోస్టుకు సమాన, తక్కువస్థాయి పోస్టు ఇవ్వాలని... కలెక్టర్లకు ఆదేశించింది.

compassionate appointment to the families of Corona deceased
కారుణ్య నియామకానికి ప్రభుత్వం అనుమతి
author img

By

Published : Jan 19, 2022, 11:14 AM IST

కరోనా మృతుల కుటుంబాలకు కారుణ్య నియామకానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అనుమతి తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన వారికి ఉద్యోగం కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

మరణించిన ఉద్యోగి పోస్టుకు సమాన, తక్కువస్థాయి పోస్టు ఇవ్వాలని... గతేడాది నవంబరు 31లోగా మరణించిన వారి కుటుంబాల్లో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. కొందరిని గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించాలని కలెక్టర్లకు ఆదేశించింది. దీనికి సంబంధించి పెద్దమొత్తంలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని త్వరగా పరిశీలించి నియామకం చేపట్టాలని సంబంధింత అధికారులను ఆదేశించింది.

కరోనా మృతుల కుటుంబాలకు కారుణ్య నియామకానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అనుమతి తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన వారికి ఉద్యోగం కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

మరణించిన ఉద్యోగి పోస్టుకు సమాన, తక్కువస్థాయి పోస్టు ఇవ్వాలని... గతేడాది నవంబరు 31లోగా మరణించిన వారి కుటుంబాల్లో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. కొందరిని గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించాలని కలెక్టర్లకు ఆదేశించింది. దీనికి సంబంధించి పెద్దమొత్తంలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని త్వరగా పరిశీలించి నియామకం చేపట్టాలని సంబంధింత అధికారులను ఆదేశించింది.

ఇదీ చదవండి.. Govt employees: ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు.. త్వరలో ఉత్తర్వులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.