జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్కు వైద్య పరీక్షల్లో కరోనా నెగిటివ్గా నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇటీవల ముషీరాబాద్ డివిజన్ పరిధిలో జరిగిన స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఓ హోటల్లో టీ తాగారు. గతంలో ఆ టీ దుకాణంలో పనిచేసే మాస్టర్కు కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మేయర్ ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్గా నిర్ధరణ అయింది.