ETV Bharat / state

ట్రాఫిక్​ ఫ్రీ నగరంగా మార్చేందుకు కృషి: జీహెచ్​ఎంసీ కమిషనర్​ - hyderabad latest news

హైదరాబాద్​ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దెందుకు అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నామని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం న‌గ‌రంలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్​లు, రోడ్డు విస్తరణ, మిస్సింగ్ లింక్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ghmc commissioner lokesh kumar on traffic in hyderabad
ట్రాఫిక్​ ఫ్రీ నగంగా మార్చేందుకు కృషి: జీహెచ్​ఎంసీ కమిషనర్​
author img

By

Published : Jul 3, 2020, 7:03 PM IST

మాదాపూర్-కూక‌ట్‌ప‌ల్లి మ‌ధ్య ప్రస్తుతం ఉన్న రోడ్లపై ర‌ద్దీని త‌గ్గించి వాహ‌నాల రాక‌పోక‌ల‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు రూ. 83.06 కోట్లతో నాలుగు లైన్ల రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్​ కుమార్ తెలిపారు. హైదరాబాద్​ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం న‌గ‌రంలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్​లు, రోడ్డు విస్తరణ, మిస్సింగ్ లింక్ రోడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో మూసాపేట్, కైతలాపూర్-అయ్యప్ప సొసైటీ రోడ్డు మధ్య చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి మొత్తం 12 పిల్లర్లతో పనులు జరుగుతున్నాయన్నారు. మాదాపూర్ మార్గంలో ఉన్న 100 ఫీట్ల రోడ్డును కలిపేందుకు అనువుగా అయ్యప్ప సోసైటీ నుంచి సమాంతరంగా రోడ్డును ఇటీవలే వేసినట్టు పేర్కొన్నారు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తయితే చుట్టుతిరిగి రావాల్సిన వాహనాలు నేరుగా వచ్చే వెసులుబాటు కలగటంతోపాటు 5 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివ‌రించారు.

మాదాపూర్-కూక‌ట్‌ప‌ల్లి మ‌ధ్య ప్రస్తుతం ఉన్న రోడ్లపై ర‌ద్దీని త‌గ్గించి వాహ‌నాల రాక‌పోక‌ల‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు రూ. 83.06 కోట్లతో నాలుగు లైన్ల రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన‌ట్లు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్​ కుమార్ తెలిపారు. హైదరాబాద్​ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం న‌గ‌రంలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్​లు, రోడ్డు విస్తరణ, మిస్సింగ్ లింక్ రోడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో మూసాపేట్, కైతలాపూర్-అయ్యప్ప సొసైటీ రోడ్డు మధ్య చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి మొత్తం 12 పిల్లర్లతో పనులు జరుగుతున్నాయన్నారు. మాదాపూర్ మార్గంలో ఉన్న 100 ఫీట్ల రోడ్డును కలిపేందుకు అనువుగా అయ్యప్ప సోసైటీ నుంచి సమాంతరంగా రోడ్డును ఇటీవలే వేసినట్టు పేర్కొన్నారు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తయితే చుట్టుతిరిగి రావాల్సిన వాహనాలు నేరుగా వచ్చే వెసులుబాటు కలగటంతోపాటు 5 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివ‌రించారు.

ఇవీచూడండి: ఆన్​లైన్ క్లాసులపై దాగుడు మూతలొద్దు.. ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.