హైదరాబాద్ నగరంలో శిథిలావస్థకు చేరిన 49 భవనాలు ఐదు రోజుల్లో కూల్చివేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. అలాంటి భవనాల్లో ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయం లేనివారికి కమ్యునిటీ హాల్స్లో తాత్కాలిక వసతి కల్పిస్తామన్నారు. ఇప్పటివరకూ నగరంలో 531 భవనాలు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించామని... వాటిలో 176 భవనాలు కూల్చి వేసి, 109 భవనాలకు మరమ్మతులు చేయించామని పేర్కొన్నారు.
మూసి నది పరీవాహక ప్రాంతం మంగళహాట్లో నివసిస్తున్న 35 మందిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించామని ఆయన తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న శిథిల భవనాల్లో నివసించరాదని నోటీసులు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. వరదతో దెబ్బతిన్న ఇళ్ళలోనూ ఉండొద్దని ప్రజలకు సూచించారు. ఇళ్ళు ఖాళీ చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: ముంపు బాధితులు ప్రభుత్వానికి అండగా ఉండాలి: కేటీఆర్