ETV Bharat / state

పైవంతెన ప్రమాదాలపై జీహెచ్​ఎంసీ అప్రమత్తం

గచ్చిబౌలి బయోడైవర్సిటీ  పైవంతెన  ప్రారంభించిన  కొద్ది రోజుల్లోనే వరుస ప్రమాదాలు జరగడం వల్ల జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నిర్మాణ  లోపాలపై  విమర్శలు రాగా.. స్వతంత్ర ఇంజినీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించి సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది.  దీనికోసం ఫ్లై ఓవర్​పై మూడు రోజులు రాకపోకలు నిలిపివేసి లోపాలు గుర్తించి సరిచేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

author img

By

Published : Nov 24, 2019, 7:01 AM IST

Updated : Nov 24, 2019, 12:24 PM IST

పైవంతెన ప్రమాదాలపై జీహెచ్​ఎంసీ అప్రమత్తం


హైదరాబాద్ ఖాజాగుడా నుంచి హైటెక్ సిటీ వైపు కిలో మీటరు పైవంతెనను జీహెచ్ఎంసీ నిర్మించింది. నిన్న ప్లైఓవర్ ప్రమాద ఘటనపై బల్దియా అధికారులు చర్యలు ప్రారంభించారు. సమస్య కారణాలను గుర్తించి సరిచేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నెల నాలుగున ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్​పై పది రోజుల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరుగగా నలుగురు మృత్యువాతపడ్డారు. నిన్నటి ప్రమాదంలో ఒకరు మరణించగా ముగ్గురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

నియంత్రణ వేగం 40 కి.మీ.:

ఈ ప్రమాదానికి కారణం అతివేగమే కారణమని అధికారులు తెలిపారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పైవంతెన పై నుంచి కింద పడిపోయిందన్నారు. అయితే గతంలో జరిగిన ప్రమాదం తరువాత ఇక్కడ పూర్తిస్థాయిలో సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. వేగ నియంత్రణ కూడా 40 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఈ ప్లైఓవర్ నిర్మాణం ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ నిబంధనలకు అనుసరించి చేపట్టామని బల్దియా ప్రాజెక్ట్స్ ప్రధాన ఇంజినీర్ శ్రీధర్ తెలిపారు.

5 లక్షల పరిహారం:

ప్లైఓవర్​పై రాకపోకలు నిషేధించాలని బల్దియా ఇంజినీరింగ్ అధికారులకు, సైబరాబాద్ పోలీసులకు మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. అన్నిరకాల భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే కాకుండా ఒక స్వతంత్ర కమిటీని వేసి విచారణ జరపాలన్నారు. మృతి చెందిన సత్యవేణి కుటుంబానికి మేయర్ బోంతు రామ్మోహన్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మూడు రోజుల పాటు పైవంతెనపై వాహనాలను నిలిపి వేయాలని అధికారులకు ఆదేశించారు.

పైవంతెన ప్రమాదాలపై జీహెచ్​ఎంసీ అప్రమత్తం

ఇవీ చూడండి: 'పైవంతెన'పై మరో ప్రమాదం... గాల్లో కారు పల్టీ


హైదరాబాద్ ఖాజాగుడా నుంచి హైటెక్ సిటీ వైపు కిలో మీటరు పైవంతెనను జీహెచ్ఎంసీ నిర్మించింది. నిన్న ప్లైఓవర్ ప్రమాద ఘటనపై బల్దియా అధికారులు చర్యలు ప్రారంభించారు. సమస్య కారణాలను గుర్తించి సరిచేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నెల నాలుగున ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్​పై పది రోజుల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరుగగా నలుగురు మృత్యువాతపడ్డారు. నిన్నటి ప్రమాదంలో ఒకరు మరణించగా ముగ్గురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

నియంత్రణ వేగం 40 కి.మీ.:

ఈ ప్రమాదానికి కారణం అతివేగమే కారణమని అధికారులు తెలిపారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పైవంతెన పై నుంచి కింద పడిపోయిందన్నారు. అయితే గతంలో జరిగిన ప్రమాదం తరువాత ఇక్కడ పూర్తిస్థాయిలో సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. వేగ నియంత్రణ కూడా 40 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఈ ప్లైఓవర్ నిర్మాణం ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ నిబంధనలకు అనుసరించి చేపట్టామని బల్దియా ప్రాజెక్ట్స్ ప్రధాన ఇంజినీర్ శ్రీధర్ తెలిపారు.

5 లక్షల పరిహారం:

ప్లైఓవర్​పై రాకపోకలు నిషేధించాలని బల్దియా ఇంజినీరింగ్ అధికారులకు, సైబరాబాద్ పోలీసులకు మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. అన్నిరకాల భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే కాకుండా ఒక స్వతంత్ర కమిటీని వేసి విచారణ జరపాలన్నారు. మృతి చెందిన సత్యవేణి కుటుంబానికి మేయర్ బోంతు రామ్మోహన్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మూడు రోజుల పాటు పైవంతెనపై వాహనాలను నిలిపి వేయాలని అధికారులకు ఆదేశించారు.

పైవంతెన ప్రమాదాలపై జీహెచ్​ఎంసీ అప్రమత్తం

ఇవీ చూడండి: 'పైవంతెన'పై మరో ప్రమాదం... గాల్లో కారు పల్టీ

TG_HYD_06_24_Ghmc_Study_On_Flyover_Pkg_3182301 Reporter: Kartheek () బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వరుస ప్రమాదాలు జరగడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. నిర్మాణ లోపాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్వతంత్ర ఇంజినీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించి సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. దీనికోసం ఫ్లై ఓవర్ పై మూడు రోజులు రాకపోకలు నిలిపివేసి లోపాలు గుర్తించి సరిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. Look వాయిస్ ఓవర్ః హైదరాబాద్ ఖాజాగుడా నుంచి హైటెక్ సిటి వైపు బయోడైవర్సీటీ దగ్గర కిలో మీటరు లోపు వన్ వేగా....మూడు లైన్ల ఫైఓవర్ ను జీహెచ్ఎంసీ నిర్మించింది. నిన్న ప్లైఓవర్ ప్రమాద ఘటణపై బల్దియా అధికారులు చర్యలు ప్రారంభించారు. సమస్య కారణాలను గుర్తించి సరిచేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నెల నాలుగో తేదీనా ప్రారంభిన ఈ ఫ్లైఓవర్ పై పదిజోల వ్యవదిలో రెండు ప్రమాదలు జరుగగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. నిన్న ప్రమాదంలో ఒకరు మరణించగా మరికొందరూ తీవ్రంగా గాయపడి చికిత్స పోందుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం అతివేగమే కారణమని అధికారులు అంటున్నారు. వేగంగా వచ్చిన కారు కంట్రోల్ కాకపోవడంతోనే ప్లైఓవర్ పై నుంచి కింద పడిపోయిందంటున్నారు. అయితే గతంలో జరిగిన ప్రమాదం తరువాత ఇక్కడ పూర్తిస్థాయిలో సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. వేగ నియంత్రణ కూడా 40గా నిర్ణయించారు. ఈ ప్లైఓవర్ నిర్మాణం ఇండియన్ రోడ్డు కాంగ్రేస్ నిబంధనలకు అనుసరించి చేపట్టామని బల్దియా ప్రాజెక్ట్స్ ప్రధాన ఇంజినీర్ శ్రీధర్ తెలిపారు. వాయిస్ ఓవర్ః అయితే ఈ ఘటనపై మంత్రి కేటిఆర్ స్పందించారు. ప్లైఓవర్ పై రాకపోకలు నిషేధించాలని బల్దియా ఇంజనీరింగ్ అధికారులకు, సైబరాబాద్ పోలీసులకు మంత్రి సూచనలు చేశారు. వేగ నియంత్రణ చర్యలు తీసుకోని అన్నిరకాల భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే కాకుండా ఒక స్వతంత్ర కమిటీని వేసి విచారణ జరుపాలని సూచించారు. ఇక ఘటనపై ద్రిగ్బాంతిని వ్యక్తం చేశారు మేయర్ బోంతు రామ్మోహన్. మృతి చెందిన మహిళ కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకించారు మేయర్. మూడు రోజుల పాటు ఫ్లైఓవర్ పై వాహనాలను నిలిపి వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎండ్.....
Last Updated : Nov 24, 2019, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.