వర్షాకాలంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని... జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన మహిళలకు అవగాహన కల్పించారు. సాప్ సంస్థ ప్రారంభించి 100 రోజులు పూర్తైన సందర్భంగా చందానగర్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో.. సినీనటి సోనీ చటర్జీతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు పలు సూచనలు చేశారు. తడి, పొడి చెత్త ద్వారా మహిళలు ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కాళేశ్వరంలో పరుగులు పెడుతున్న గోదారమ్మ