ETV Bharat / state

Gang Rape on Minor Girl in Meerpet : హైదరాబాద్‌లో దారుణం.. ఇంట్లోకి దూరి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

Minor Girl Gang Raped in Meerpet at Hyderabad : మహిళలు, చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ మైనర్‌ బాలికపై.. ఎనిమిది దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు.

author img

By

Published : Aug 21, 2023, 10:49 PM IST

Rape on Girl in Hyderabad
minor girl gang raped in Meerpet

Gang Rape on Minor Girl in Hyderabad : సమాజంలో రోజురోజుకూ మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేదు.. ఆడపిల్ల అయితే చాలనుకుని మృగాళ్లలా మీద పడిపోతున్నారు కొందరు. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరికొందరు. తమ కామ వాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా జంకే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. కీచకుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

మీర్‌పేట్‌లో దారుణం చోటుచేసుకుంది. కత్తులతో బెదిరించి ఓ మైనర్ బాలికపై.. ఎనిమిది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి (Gang Rape on Minor Girl in Hyderabad ) పాల్పడ్డారు. బాధితురాలి ఇంట్లోకి దూరి.. తమ్ముడి ముందే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరంతా గంజాయి వినియోగం, విక్రయాలు జరిగే ముఠాగా పోలీసులు అనుమనిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆరా తీశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో.. సెల్‌ఫోన్ ఇస్తామని ఆశచూపించి ఓ మైనర్ బాలికపై తండ్రీకుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. బతుకు దెరువు కోసం ఓ కుటుంబం 7 సంవత్సరాల క్రితం వలస వచ్చింది. రోజువారీలాగే ఆ తల్లిదండ్రులు.. తమ పాపను ఇంటి వద్ద వదిలి పనికి వెళ్లారు. ఈ క్రమంలోనే వీరి ఇంటికి సమీపంలో శివకుమార్‌ కుటుంబం నివసిస్తోంది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఆ మైనర్ బాలికను శివకుమార్‌(45), అతని కుమారుడు శ్యామెల్‌ (19) గమనించారు.

రన్నింగ్ ట్రైన్​లో రేప్​.. బిడ్డను బయట పడేస్తామని బెదిరించి తల్లిపై అత్యాచారం

ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారికి సెల్‌ఫోన్‌ ఇస్తామని ఆశ చూపించి.. తండ్రీకుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వికారాబాద్ జిల్లాలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని ఇంటి వద్ద దింపుతానని చెప్పి కారులో తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాలిక వారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

బ్రేకప్ చెప్పిందని కోపం.. పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి.. బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్

ఉద్యోగం పేరుతో 'ఆమె'ను వ్యభిచార ఊబిలోకి నెట్టిన అంకుల్​..

Gang Rape on Minor Girl in Hyderabad : సమాజంలో రోజురోజుకూ మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేదు.. ఆడపిల్ల అయితే చాలనుకుని మృగాళ్లలా మీద పడిపోతున్నారు కొందరు. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరికొందరు. తమ కామ వాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా జంకే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. కీచకుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

మీర్‌పేట్‌లో దారుణం చోటుచేసుకుంది. కత్తులతో బెదిరించి ఓ మైనర్ బాలికపై.. ఎనిమిది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి (Gang Rape on Minor Girl in Hyderabad ) పాల్పడ్డారు. బాధితురాలి ఇంట్లోకి దూరి.. తమ్ముడి ముందే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరంతా గంజాయి వినియోగం, విక్రయాలు జరిగే ముఠాగా పోలీసులు అనుమనిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆరా తీశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో.. సెల్‌ఫోన్ ఇస్తామని ఆశచూపించి ఓ మైనర్ బాలికపై తండ్రీకుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. బతుకు దెరువు కోసం ఓ కుటుంబం 7 సంవత్సరాల క్రితం వలస వచ్చింది. రోజువారీలాగే ఆ తల్లిదండ్రులు.. తమ పాపను ఇంటి వద్ద వదిలి పనికి వెళ్లారు. ఈ క్రమంలోనే వీరి ఇంటికి సమీపంలో శివకుమార్‌ కుటుంబం నివసిస్తోంది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఆ మైనర్ బాలికను శివకుమార్‌(45), అతని కుమారుడు శ్యామెల్‌ (19) గమనించారు.

రన్నింగ్ ట్రైన్​లో రేప్​.. బిడ్డను బయట పడేస్తామని బెదిరించి తల్లిపై అత్యాచారం

ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారికి సెల్‌ఫోన్‌ ఇస్తామని ఆశ చూపించి.. తండ్రీకుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వికారాబాద్ జిల్లాలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని ఇంటి వద్ద దింపుతానని చెప్పి కారులో తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాలిక వారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

బ్రేకప్ చెప్పిందని కోపం.. పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి.. బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్

ఉద్యోగం పేరుతో 'ఆమె'ను వ్యభిచార ఊబిలోకి నెట్టిన అంకుల్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.