ప్రజా కవి వరవరరావు అనారోగ్యం దృష్ట్యా ఆయన కుటుంబం ఎంతో ఆందోళన చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లేఖ రాశారు. భీమా కోరేగాన్ కేసులో అరెస్టయిన వరవరరావు.. ప్రస్తుతం కరోనా బారిన పడి ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన లేఖలో వివరించారు.
2004లో మావోయిస్టులతో జరిగిన చర్చల్లో వరవరరావు కీలకపాత్ర పోషించారని జానారెడ్డి అన్నారు. ఆయన కొవిడ్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని లేఖలో తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్పై ఆయన విడుదల చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం