హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని తులసిరాం నగర్ బస్తీలో ఉంటున్న సుమారు 400 మంది వలస కార్మికులు, పేదలకు దుర్గాభవాని అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. లాక్డౌన్ సందర్భంగా ఉపాధి లేక ఆకలితో ఎవరూ ఉండకూడదనే ఈ అన్నదానం కార్యక్రమం నిర్వహించినట్లు అసోసియేషన్ కన్వీనర్ దుబ్బాక ఈశ్వర్ బెస్త తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సంస్థ ప్రతినిధి సుధీర్ బెస్త సూచించారు.
ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ... శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని గోల్నాక భాజపా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి రామ్ బెస్త విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ సంక్షోభంలో ప్రధానికి సోనియా 5 సూచనలు