తబ్లిగ్- ఈ- జమాత్ కేసులో హైదరాబాద్లోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ సహా నాలుగు రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి.. మత పరమైన కార్యక్రమాలు నిర్వహించి.. కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న అభియోగాలతో దిల్లీలో కేసు నమోదైంది.
తబ్లిగ్- ఈ- జమాత్పై ఈసీఐఆర్ నమోదు చేసిన.. దిల్లీ ఈడీ విభాగం బుధవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లోని లంగర్ హౌజ్, మల్లేపల్లి, టోలీ చౌకి, మలక్ పేట్లో ఈడీ బృందాలు తనిఖీలు చేశాయి.
ఇదీ చూడండి: అమీన్పూర్ ఘటనలో హైపవర్ కమిటీ గడువు పెంపు!