ETV Bharat / state

"సైనికుల త్యాగాలకు గుర్తుగా 'భారత యాత్ర' అభినందనీయం"

పుల్వామా ఘటనలో ఉగ్రవాదులు భారత సైనిక దళాలపై దాడికి పాల్పడిన ఘటనను.. భారత సైనికుల త్యాగాలను గుర్తు చేస్తూ 'భారత యాత్ర' పేరుతో నలుగురు సభ్యులు చేసిన యాత్ర  అభినందనీయమని భాజపా నాయకుడు  పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. సంజీవయ్య పార్కులో ఈ యాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించారు.

author img

By

Published : Nov 18, 2019, 11:40 AM IST

సంజీవయ్య పార్కులో 'భారత యాత్ర' ముగింపు
సంజీవయ్య పార్కులో 'భారత యాత్ర' ముగింపు

పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ.. దేశ భక్తిని.. సైనికుల ధీరత్వాన్ని గుర్తుచేస్తూ... ఐస్ స్టాండ్ ఫర్ ద నేషన్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులు చేసిన 'భారత యాత్ర' ముగిసింది. దిల్లీ నుంచి కన్యాకుమారి మీదగా దాదాపు 27 నగరాలకు పైగా తిరిగి ఐదు వేల మైళ్ళ ప్రయాణించి హైదరాబాదులోని సంజీవయ్య పార్కు వద్ద ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. యాత్రలో పాల్గొన్న నలుగురు సభ్యులను ఆయన సన్మానించి అభినందనలు తెలియజేశారు. 2020 ఫిబ్రవరి 14వ తేదీ వరకు ప్రపంచంలోని ప్రతి భారతీయుడు దేశం కోసం నిలబడతాను అనే నినాదాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతమాత ముద్దుబిడ్డ జనసైనికులు విపత్కర పరిస్థితుల్లో మంచుకొండల్లో దేశ రక్షణ కోసం పాటు పడుతున్న వారిని విచక్షణరహితంగా ఘటనలో ఉగ్రవాదుల మట్టు పెట్టారని... వారి శూరత్వాన్ని, త్యాగాలను గుర్తు చేస్తూ చేసిన యాత్ర ఎంతో గొప్పదని సుధాకర్​ కొనియాడారు.

పుల్వామా ఘటనలో అమరులైన 64 మంది జవాన్లకు సంఘీభావంగా వారి ప్రాణ త్యాగాలను స్మరిస్తూ యాత్ర చేసినట్లు యాత్ర నిర్వాహకులు హరికృష్ణ తెలిపారు. భారత జాతీయ ఐక్యత నినాదాన్ని కొనసాగించేందుకు మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావం పొందాలని 'నేను నా దేశం కోసం నిలబడతాను' అనే నినాదాన్ని ప్రతి ఒక్కరిలో కల్పించాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు వారు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె: పట్టు వీడ లేదు.. మెట్టు దిగ లేదు..?

సంజీవయ్య పార్కులో 'భారత యాత్ర' ముగింపు

పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ.. దేశ భక్తిని.. సైనికుల ధీరత్వాన్ని గుర్తుచేస్తూ... ఐస్ స్టాండ్ ఫర్ ద నేషన్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులు చేసిన 'భారత యాత్ర' ముగిసింది. దిల్లీ నుంచి కన్యాకుమారి మీదగా దాదాపు 27 నగరాలకు పైగా తిరిగి ఐదు వేల మైళ్ళ ప్రయాణించి హైదరాబాదులోని సంజీవయ్య పార్కు వద్ద ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. యాత్రలో పాల్గొన్న నలుగురు సభ్యులను ఆయన సన్మానించి అభినందనలు తెలియజేశారు. 2020 ఫిబ్రవరి 14వ తేదీ వరకు ప్రపంచంలోని ప్రతి భారతీయుడు దేశం కోసం నిలబడతాను అనే నినాదాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతమాత ముద్దుబిడ్డ జనసైనికులు విపత్కర పరిస్థితుల్లో మంచుకొండల్లో దేశ రక్షణ కోసం పాటు పడుతున్న వారిని విచక్షణరహితంగా ఘటనలో ఉగ్రవాదుల మట్టు పెట్టారని... వారి శూరత్వాన్ని, త్యాగాలను గుర్తు చేస్తూ చేసిన యాత్ర ఎంతో గొప్పదని సుధాకర్​ కొనియాడారు.

పుల్వామా ఘటనలో అమరులైన 64 మంది జవాన్లకు సంఘీభావంగా వారి ప్రాణ త్యాగాలను స్మరిస్తూ యాత్ర చేసినట్లు యాత్ర నిర్వాహకులు హరికృష్ణ తెలిపారు. భారత జాతీయ ఐక్యత నినాదాన్ని కొనసాగించేందుకు మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావం పొందాలని 'నేను నా దేశం కోసం నిలబడతాను' అనే నినాదాన్ని ప్రతి ఒక్కరిలో కల్పించాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు వారు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె: పట్టు వీడ లేదు.. మెట్టు దిగ లేదు..?

Intro:సికింద్రాబాద్ యాంకర్. పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు భారత సైనిక దళాల పై దాడికి పాల్పడిన ఘటన భారత సైనికుల త్యాగాలను గుర్తు చేస్తూ భారత యాత్ర పేరుతో చేసిన యాత్ర అభినందనీయమని భాజపా నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు.. ఐస్ స్టాండ్ ఫర్ ద నేషన్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులు ఈ భారత యాత్రలో పాల్గొని నేడు ముగింపు పలికారు.. ఢిల్లీ నుండి కన్యాకుమారి మీద దాదాపు 27 నగరాలకు పైగా తిరిగి ఐదు వేల మైళ్ళ ప్రయాణించి నేడు హైదరాబాదులోని సంజీవయ్య పార్కు వద్ద ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు.. నలుగురు సభ్యులను ఆయన సన్మానించి అభినందనలు తెలియజేశారు... అదేవిధంగా 2020 ఫిబ్రవరి 14వ తేదీ వరకు ప్రపంచంలోని ప్రతి భారతీయుడు దేశం కోసం నిలబడతాను అనే నినాదాన్ని చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతమాత ముద్దుబిడ్డ జనసైనికులు విపత్కర పరిస్థితుల్లో మంచుకొండల్లో దేశ రక్షణ కోసం పాటు పడుతున్న వారిని విచక్షణరహితంగా ఘటనలో ఘటన లో ఉగ్రవాదుల మట్టు పెట్టారని వారి శూరత్వాన్ని త్యాగాలను గుర్తు చేస్తూ చేసిన పాత్ర ఎంతో గొప్పది అని కొనియాడారు.. దేశ రక్షణకు పాటుపడుతున్న జవాన్లకు అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ వారు ఇంత పెద్ద ఎత్తున మైళ్లు ప్రయాణించి దేశభక్తిని చాటుకున్నారు అని అన్నారు.. సైనికుల్లో పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు వారికి సంఘీభావంగా చేసిన ఈ యాత్ర గొప్పదని అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా చేయడానికి ప్రధానమంత్రి మోడీ ఎంతగానో కృషి చేస్తున్నారని భారత సైన్యం ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో పటిష్టంగా ఉందని అన్నారు.. భారత దేశానికి ప్రధాన శత్రువుగా ఉగ్రవాదం మారిందని ఉగ్రవాద రహిత దేశంగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎంతగానో ప్రధానమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.. కాంగ్రెస్ మరియు ఇతర విపక్షాలకు బుధవారం పట్ల చిత్తశుద్ధి లేదని వారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడడం శోచనీయమన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్వామా ఘటనలో అమరులైన 64 మంది జవాన్లకు సంఘీభావంగా వారి ప్రాణ త్యాగాలను స్మరిస్తూ యాత్రలో చేసినట్లు వారు తెలిపారు.. భారత జాతీయ ఐక్యత నినాదాన్ని కొనసాగించేందుకు మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటామని ఆయన అన్నారు.. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావం పొందాలని నేను నా దేశం కోసం నిలబడతాను అనే నినాదాన్ని ప్రతి ఒక్కరిలో కల్పించాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు..
బైట్ పొంగులేటి సుధాకర్ రెడ్డి భాజపా నాయకుడు
హరికృష్ణ నిర్వాహకులు


Body:వంశీ


Conclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.