ETV Bharat / state

పీఆర్సీపై ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హర్షం

author img

By

Published : Mar 24, 2021, 2:44 PM IST

రెగ్యులర్ ఉద్యోగులతో పాటు తమకూ పీఆర్సీ ప్రకటించడం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇకపై తాము మరింత ఉత్సాహంతో పని చేస్తామని తెలిపారు.

employees-thanks-to-cm-kcr-for-prc-in-telangana
పీఆర్సీపై ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హర్షం

రాష్ట్రంలో ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ 30శాతం పీఆర్సీ ప్రకటించడం పట్ల టూరిజం కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్​బాగ్​లోని తెలంగాణ ప్రధాన రిజర్వేషన్ కార్యాలయం ముందు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్​ను కొనియాడుతూ నినాదాలు చేశారు.

ఈ ప్రకటనతో తాము మరింత ఉత్సాహంగా పని చేస్తామని తెలిపారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. తమకూ పీఆర్సీ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ 30శాతం పీఆర్సీ ప్రకటించడం పట్ల టూరిజం కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్​బాగ్​లోని తెలంగాణ ప్రధాన రిజర్వేషన్ కార్యాలయం ముందు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్​ను కొనియాడుతూ నినాదాలు చేశారు.

ఈ ప్రకటనతో తాము మరింత ఉత్సాహంగా పని చేస్తామని తెలిపారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. తమకూ పీఆర్సీ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: సీబీఐ దర్యాప్తుపై పరమ్​వీర్​ పిటిషన్​ ఉపసంహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.