రాష్ట్రంలో ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ 30శాతం పీఆర్సీ ప్రకటించడం పట్ల టూరిజం కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని తెలంగాణ ప్రధాన రిజర్వేషన్ కార్యాలయం ముందు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ను కొనియాడుతూ నినాదాలు చేశారు.
ఈ ప్రకటనతో తాము మరింత ఉత్సాహంగా పని చేస్తామని తెలిపారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. తమకూ పీఆర్సీ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: సీబీఐ దర్యాప్తుపై పరమ్వీర్ పిటిషన్ ఉపసంహరణ