బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను పెంచడం ద్వారా కొత్తగా మూలధనం వచ్చే అవకాశాలు తక్కువేని ఎల్ఐసీ ఉద్యోగులు తెలిపారు. ఎల్ఐసీని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు వేతన సవరణ అమలు చేయాలని కోరుతూ.. హైదరాబాద్లోని ఎల్ఐసీ జోనల్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, అధికారులు కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ఐపీఓ వల్ల ప్రైవీటీకరణ ప్రారంభమవుతుందని ఎల్ఐసీ ఉద్యోగులు తెలిపారు. ఆ కారణంగా బీమాదారులకు ఇచ్చే బోనస్ తగ్గి పోతుందని.. ఆ కారణంగానే తాము కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ