ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019ను హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అదనపు కమిషనర్ యాదగిరి రావు ప్రారంభించారు. లీగ్లో భాగంగా కబడ్డీ, కో కో, వాలీబాల్, చెస్, టెన్నిస్ పోటీలు రెండు రోజులు జరగనున్నాయి.
విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి
విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అదనపు కమిషనర్ యాదగిరి రావు తెలిపారు. ఈనాడు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కమిషనర్ అభినందించారు. విద్యార్థులు పోటీల్లో పాల్గొనాలని కోరారు.
ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం