బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడిపై ఈడీ అధికారులు ఆన్లైన్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మల్లిక బార్ అండ్ రెస్టారెంట్ యజమాని లింగాల శ్రీనివాస్ గౌడ్పై నాంపల్లి కోర్టులో ఎన్ఫోర్స్ మెంట్ ఆన్లైన్లో ఛార్జ్షీట్ను సమర్పించింది.
తప్పుడు దస్త్రాలు సమర్పించి 44 లక్షల 80 వేల రూపాయలు రుణం తీసుకుని మోసం చేశారని ఫెడరల్ బ్యాంకు గతంలో హైదరాబాద్ సీసీఎస్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన సీసీఎస్.. లింగాల శ్రీనివాస్ గౌడ్ మోసపూరితంగా రుణాలు పొంది బార్ అండ్ రెస్టారెంట్కు మళ్లించినట్లు తేల్చింది.
నష్టాలు రావడం వల్ల బార్ అండ్ రెస్టారెంట్ను మూసివేసి రుణం ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేలింది. సీసీఎస్ అభియోగపత్రం ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ... మనీలాండరింగ్ అభియోగాలతో నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
ఇదీ చూడండి : కరోనాతో మృతిచెందిన కానిస్టేబుల్కు డీజీపీ సంతాపం