ETV Bharat / state

నేటి నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్

author img

By

Published : Oct 29, 2020, 9:11 PM IST

Updated : Oct 30, 2020, 3:44 AM IST

ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ సవరించిన షెడ్యూల్ ప్రకటించారు. నేటి నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని వారికి... నవంబర్ 1న మరోసారి అవకాశం కల్పించారు.

eamcet shedule change in Telangana
నేటి నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్

నేటి నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని వారికి నవంబర్ 1న మరోసారి అవకాశం కల్పించారు. నవంబర్ 1న ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 31న ఆన్​లైన్​లో ప్రాసెసింగ్ రుసుం చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రవేశాల కమిటీ ఛైర్మన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.

ఇవాళ్టి నుంచి నవంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 4న ఇంజనీరింగ్ తుది విడత సీట్లను కేటాయించనున్నారు. నవంబర్ 4 నుంచి 7 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ... బుధవారం హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వాయిదా పడింది. ఓపెన్ స్కూల్​లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు 35శాతం మార్కులనే ప్రవేశ పరీక్షలకు అర్హత పరిగణించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా సవరించిన షెడ్యూలు విడుదల చేశారు.

నేటి నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని వారికి నవంబర్ 1న మరోసారి అవకాశం కల్పించారు. నవంబర్ 1న ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 31న ఆన్​లైన్​లో ప్రాసెసింగ్ రుసుం చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రవేశాల కమిటీ ఛైర్మన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.

ఇవాళ్టి నుంచి నవంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 4న ఇంజనీరింగ్ తుది విడత సీట్లను కేటాయించనున్నారు. నవంబర్ 4 నుంచి 7 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ... బుధవారం హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వాయిదా పడింది. ఓపెన్ స్కూల్​లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు 35శాతం మార్కులనే ప్రవేశ పరీక్షలకు అర్హత పరిగణించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా సవరించిన షెడ్యూలు విడుదల చేశారు.

ఇదీ చదవండి: రీడిజైన్​ చేయాలంటూ తప్పుడు నివేదిక ఇచ్చారు: వంశీచంద్​ రెడ్డి

Last Updated : Oct 30, 2020, 3:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.