అనేక ప్రజాసమస్యలపై సభలో గళం విప్పుతాం: రఘునందన్ - telangana varthalu
అసెంబ్లీ సమావేశాలకు తొలిసారిగా హాజరుకాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం నుంచి శాసనసభ సభ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న అనేక ప్రజా సమస్యలపై సభలో గళం విప్పుతామంటున్న రఘునందన్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.