రాష్ట్రంలో పక్కాగా లాక్డౌన్(lockdown) అమలు చేస్తుండడంతో కరోనా(corona) కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని వైద్యోరోగ్యశాఖ సంచాలకులు(DH) శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక చర్యలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. బ్లాక్ ఫంగస్(black fungus) బాధితులకు మెరుగ్గా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రైవేట్ ఆస్పత్రుల(private hospitals)పై ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కొవిడ్ చికిత్సలో అక్రమంగా వ్యవహరించిన ప్రైవేట్ ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరించి మూసేందుకూ వెనకాడబోమంటున్న వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: 2 DG drug: 2-డీజీ డ్రగ్ ధర ఎంతంటే!