పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన నిధుల మంజూరు పత్రాలను ఉపసభాపతి తీగుల్ల పద్మారావు అందజేశారు. సీతాఫల్మండి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.4 లక్షలకు సంబంధించిన ఎల్ఓసీ పత్రాలను పంపిణీ చేశారు.
సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన మధుకర్ యాదవ్కు, అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన అంజలి సీఎం రిలీఫ్ ఫండ్ను ఉపసభాపతి పద్మారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు కంది నారాయణ, పాక సాయి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దేశంలోనే తెలంగాణ నంబర్వన్