ETV Bharat / state

sai dharam tej: అతివేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం: డీసీపీ

author img

By

Published : Sep 11, 2021, 9:08 PM IST

Updated : Sep 11, 2021, 10:22 PM IST

అతివేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం: డీసీపీ
అతివేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం: డీసీపీ

21:06 September 11

అతివేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం: డీసీపీ

సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ నడిపిన ద్విచక్రవాహనం అనిల్‌ కుమార్‌ పేరుతో ఉందని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సాయితేజ్‌ ప్రమాద ఘటనపై డీసీపీ మీడియాతో మాట్లాడారు.  

"ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌ నుంచి ట్రంప్‌ బైక్‌ను సాయితేజ్‌ కొనుగోలు చేశారు. వాహనం మాత్రం ఇంకా అనిల్‌ పేరు మీదే ఉంది. సాయితేజ్‌ పేరు మీద మార్చుకోలేదు. గతేడాది ఆగస్టు 2న అతివేగంగా వెళ్లినందుకు ట్రంప్‌ బైక్‌పై 1,135 రూపాయల జరిమానా పడింది. ఈరోజు ఆ చలానా డబ్బులను ఎవరో చెల్లించారు." అని డీసీపీ తెలిపారు.  

అతివేగం, నిర్లక్ష్యం వల్లే...

'సాయి ధరమ్​తేజ్ అతివేగం, నిర్లక్ష్యంగా బైక్‌ నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. సాయితేజ్‌కు కారు నడిపేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంది. ద్విచక్రవాహనాలు నడిపేందుకు లైసెన్స్‌ ఉందా? లేదా? అనే వివరాలు సేకరిస్తున్నాం. సాయితేజ్‌ ప్రమాదానికి గురైన రహదారిపై 30 కి.మీ పరిమిత వేగంతో వెళ్లాలి. కానీ, తీగల వంతెనపై సాయితేజ్‌ బైక్‌ 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బైక్‌ 75 కి.మీ వేగంతో ఉంది.' అని డీసీపీ వివరించారు.  

హెచ్చరిక బోర్డులున్నా...

'దుర్గం చెరువు తీగల వంతెన నుంచి ఐకియా మీదుగా గచ్చిబౌలి వెళ్లే దారిలో వేగ పరిమితికి సంబంధించి తగిన బోర్డులు ఏర్పాటు చేశాం. మాదాపూర్‌ జోన్‌ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మాదాపూర్‌ జోన్‌ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 17,917 ద్విచక్రవాహనాలపై పరిమితికి మించి వేగంతో వెళ్లినందుకు జరిమానా విధించాం. 5,495 మంది ద్విచక్ర వాహనదారులపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశాం' అని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదీ చూడండి: సాయితేజ్ ప్రమాదంపై నరేశ్ వ్యాఖ్యలు సరికాదు: శ్రీకాంత్ 

21:06 September 11

అతివేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం: డీసీపీ

సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ నడిపిన ద్విచక్రవాహనం అనిల్‌ కుమార్‌ పేరుతో ఉందని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సాయితేజ్‌ ప్రమాద ఘటనపై డీసీపీ మీడియాతో మాట్లాడారు.  

"ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌ నుంచి ట్రంప్‌ బైక్‌ను సాయితేజ్‌ కొనుగోలు చేశారు. వాహనం మాత్రం ఇంకా అనిల్‌ పేరు మీదే ఉంది. సాయితేజ్‌ పేరు మీద మార్చుకోలేదు. గతేడాది ఆగస్టు 2న అతివేగంగా వెళ్లినందుకు ట్రంప్‌ బైక్‌పై 1,135 రూపాయల జరిమానా పడింది. ఈరోజు ఆ చలానా డబ్బులను ఎవరో చెల్లించారు." అని డీసీపీ తెలిపారు.  

అతివేగం, నిర్లక్ష్యం వల్లే...

'సాయి ధరమ్​తేజ్ అతివేగం, నిర్లక్ష్యంగా బైక్‌ నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. సాయితేజ్‌కు కారు నడిపేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంది. ద్విచక్రవాహనాలు నడిపేందుకు లైసెన్స్‌ ఉందా? లేదా? అనే వివరాలు సేకరిస్తున్నాం. సాయితేజ్‌ ప్రమాదానికి గురైన రహదారిపై 30 కి.మీ పరిమిత వేగంతో వెళ్లాలి. కానీ, తీగల వంతెనపై సాయితేజ్‌ బైక్‌ 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బైక్‌ 75 కి.మీ వేగంతో ఉంది.' అని డీసీపీ వివరించారు.  

హెచ్చరిక బోర్డులున్నా...

'దుర్గం చెరువు తీగల వంతెన నుంచి ఐకియా మీదుగా గచ్చిబౌలి వెళ్లే దారిలో వేగ పరిమితికి సంబంధించి తగిన బోర్డులు ఏర్పాటు చేశాం. మాదాపూర్‌ జోన్‌ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మాదాపూర్‌ జోన్‌ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 17,917 ద్విచక్రవాహనాలపై పరిమితికి మించి వేగంతో వెళ్లినందుకు జరిమానా విధించాం. 5,495 మంది ద్విచక్ర వాహనదారులపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశాం' అని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదీ చూడండి: సాయితేజ్ ప్రమాదంపై నరేశ్ వ్యాఖ్యలు సరికాదు: శ్రీకాంత్ 

Last Updated : Sep 11, 2021, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.