ETV Bharat / state

3కె ఫ్రీడం రన్​ను ప్రారంభించిన సీఎస్​, డీజీపీ

author img

By

Published : Mar 24, 2021, 9:30 AM IST

అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్​లో తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో ఫ్రీడం రన్​ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఎల్బీ స్టేడియం వరకు 3కె రన్​ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు.

cs-somesh-kumar-launches-3k-freedom-run-at-peoples-plaza-hyderabad
3కె ఫ్రీడం రన్​ను ప్రారంభించిన సీఎస్​, డీజీపీ

భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబురాలను జరుపుకుంటోంది. అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం రన్​లో సీఎస్ సోమేశ్​కుమార్, డీజీపీ మహేందర్​రెడ్డి పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఎల్బీ స్టేడియం వరకు 3కె రన్​ను జెండా ఊపి ప్రారంభించారు.

3కె ఫ్రీడం రన్​ను ప్రారంభించిన సీఎస్​, డీజీపీ

దేశభక్తిని ఇనుమడించేలా స్వాతంత్య్ర భారత అమృతోత్సవాల్లో భాగంగా.. తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో ఫ్రీడం రన్​ను నిర్వహించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ అన్నారు. దేశభక్తిని పెంపొందించేలా పరుగు పందెం చేపట్టడం సంతోషకరమన్నారు. కార్యక్రమానికి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్​లు హాజరయ్యారు. ఫ్రీడం రన్​లో సుమారు 1,500 మంది పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ రన్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ పరుగు పందెంలో భాగస్వామ్యమై దేశభక్తిని చాటాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి : ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 'ఫ్రీడం రన్‌'

భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబురాలను జరుపుకుంటోంది. అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం రన్​లో సీఎస్ సోమేశ్​కుమార్, డీజీపీ మహేందర్​రెడ్డి పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఎల్బీ స్టేడియం వరకు 3కె రన్​ను జెండా ఊపి ప్రారంభించారు.

3కె ఫ్రీడం రన్​ను ప్రారంభించిన సీఎస్​, డీజీపీ

దేశభక్తిని ఇనుమడించేలా స్వాతంత్య్ర భారత అమృతోత్సవాల్లో భాగంగా.. తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో ఫ్రీడం రన్​ను నిర్వహించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ అన్నారు. దేశభక్తిని పెంపొందించేలా పరుగు పందెం చేపట్టడం సంతోషకరమన్నారు. కార్యక్రమానికి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్​లు హాజరయ్యారు. ఫ్రీడం రన్​లో సుమారు 1,500 మంది పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ రన్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ పరుగు పందెంలో భాగస్వామ్యమై దేశభక్తిని చాటాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి : ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 'ఫ్రీడం రన్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.