ట్యాంక్బండ్పై పోలీసుల లాఠీ ఛార్జీని నిరసిస్తూ... సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... హిమాయత్ నగర్ కూడలి వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతటి అరాచకమం లేదని మాజీ ఎంపీ అజీజ్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. నాయకులను అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీచూడండి: 'అయోధ్య'పై సుప్రీం చారిత్రక తీర్పు.. శ్రీరామ పట్టాభిషేకం