ETV Bharat / state

ప్రశ్నించే గొంతును నులిమేస్తారా..? చాడా వెంకట్​రెడ్డి

author img

By

Published : Oct 30, 2019, 5:03 PM IST

ప్రజల ప్రాథమిక హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్​రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్​ సరూర్​నగర్​లో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన సమరభేరిలో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో చాడా విమర్శలు గుప్పించారు.

CPI CHADA VENKATREDDY FIRE ON CM KCR IN RTC SAMARABHERI MEETING
ప్రశ్నించే గొంతును నులిమేస్తారా: చాడా వెంకట్​రెడ్డి

పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిర్బంధాల మధ్య సభలు నిర్వహించుకోవాల్సి వస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ సరూర్​నగర్​లో ఆర్టీసీ కార్మికుల సమరభేరి సభలో పాల్గొన్న చాడా... సీఎం కేసీఆర్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... ఆ గొంతును నులుమేస్తారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగం గురించి ఏ మాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చాడా డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... కోర్టుకు నివేదికపై సమాలోచనలు!

ప్రశ్నించే గొంతును నులిమేస్తారా: చాడా వెంకట్​రెడ్డి

పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిర్బంధాల మధ్య సభలు నిర్వహించుకోవాల్సి వస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ సరూర్​నగర్​లో ఆర్టీసీ కార్మికుల సమరభేరి సభలో పాల్గొన్న చాడా... సీఎం కేసీఆర్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... ఆ గొంతును నులుమేస్తారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగం గురించి ఏ మాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చాడా డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... కోర్టుకు నివేదికపై సమాలోచనలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.