ETV Bharat / state

లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ సజ్జనార్

author img

By

Published : Dec 4, 2020, 10:17 AM IST

Updated : Dec 4, 2020, 10:26 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా సైబరాబాద్​లో లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన సీపీ... పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సైబరాబాద్​ పరిధిలో 7వేల సిబ్బంది ఉన్నట్లు చెప్పారు.

cp sajjanar talk about ghmc elections results 2020 security
లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ సజ్జనార్

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి కేంద్రం వద్ద ఓ సీనియర్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని వెల్లడించారు.

సైబరాబాద్​లో 7వేల భద్రత సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రాల సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వివరించారు. విజేతలు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై, బాణాసంచా, బ్యాండ్​మేలాలపై నిషేధం విధించామన్నారు. గెలుపొందిన అభ్యర్థులు, పార్టీలు 48 గంటల తర్వాతే ర్యాలీలు నిర్వహించుకోవాలని నిబంధన పెట్టినట్లు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. అనంతరం కూకట్​పల్లి సర్కిల్ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జోనల్ కమిషనర్ మమతతో కలిసి పరిశీలించారు.

లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ సజ్జనార్

ఇదీ చూడండి: కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి కేంద్రం వద్ద ఓ సీనియర్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని వెల్లడించారు.

సైబరాబాద్​లో 7వేల భద్రత సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రాల సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వివరించారు. విజేతలు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై, బాణాసంచా, బ్యాండ్​మేలాలపై నిషేధం విధించామన్నారు. గెలుపొందిన అభ్యర్థులు, పార్టీలు 48 గంటల తర్వాతే ర్యాలీలు నిర్వహించుకోవాలని నిబంధన పెట్టినట్లు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. అనంతరం కూకట్​పల్లి సర్కిల్ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జోనల్ కమిషనర్ మమతతో కలిసి పరిశీలించారు.

లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ సజ్జనార్

ఇదీ చూడండి: కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Last Updated : Dec 4, 2020, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.