కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జానార్ సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ ఆవరణలో సబ్సిడీ క్యాంటిన్ను సీపీ ప్రారంభించారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబ అవసరాల కోసం ప్రారంభించిన ఈ క్యాంటిన్లో నిత్యావసరాలు తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ కోరారు.
అనంతరం కమిషనరేట్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కమిషనర్ వెంకటేశ్వర్రావు, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, నేర విభాగం డీసీపీ రోహిణి, డీసీపీ పద్మజ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: హైకోర్టులో రేవంత్రెడ్డి ధిక్కరణ పిటిషన్