ETV Bharat / state

జర్నలిస్టులకు కరోనా కిట్లు, బీమాపై.. హైకోర్టు ఆదేశం - తెలంగాణ హైకోర్టు తాజా సమాచారం

దేశవ్యాప్తంగా కరోనా కారణంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన రంగాలైన మీడియా, పోలీసు, వైద్యం, పారిశుద్ధ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం తమ సేవలను అందిస్తున్నారు. వైద్యులకు, పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చిన కరోనా కిట్లు, బీమా సదుపాయం మీడియా ప్రతినిధులకు కూడా వర్తింపచేయాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

Corona kits, insurance for journalists pil on telangana high court
జర్నలిస్టులకు కరోనా కిట్లు, బీమాపై.. హైకోర్టు ఆదేశం
author img

By

Published : May 12, 2020, 11:30 PM IST

జర్నలిస్టులకు కరోనా కిట్లు, బీమా సదుపాయం, ఆర్థిక సాయం అందించాలన్న వ్యాజ్యంపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, మీడియా అకాడమీని హైకోర్టు ఆదేశించింది.

న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం సుమోటో పిల్​గా స్వీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి, మీడియా అకాడమీకి నోటీసులు జారీ చేసింది.

జర్నలిస్టులకు కరోనా కిట్లు, బీమా సదుపాయం, ఆర్థిక సాయం అందించాలన్న వ్యాజ్యంపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, మీడియా అకాడమీని హైకోర్టు ఆదేశించింది.

న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం సుమోటో పిల్​గా స్వీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి, మీడియా అకాడమీకి నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి : రాష్ట్రంలో ఇవాళ 51 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.