ETV Bharat / state

ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పుర ఎన్నికల మేనిఫెస్టో - congress to release manifesto today

అన్ని వర్గాల ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్‌ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదా సిద్ధమైంది. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ మాకంరెడ్డి రంగారెడ్డి నివేదించిన ఈ మేనిఫెస్టోపై పార్టీలో చర్చించిన తరువాత పీసీసీ తుదిరూపు ఇవ్వనుంది. అర్హులైన కుటుంబాలకు ఉచిత ఇంటి స్థలం, విద్యార్ధులకు ఉచిత రవాణా లాంటి 18 అంశాలతో మేనిఫెస్టో తయారైంది.

congress to release manifesto for telangana municipal elections today
ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పుర ఎన్నికల మేనిఫెస్టో
author img

By

Published : Jan 9, 2020, 5:36 AM IST

పురపాలక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్ధుల ఎంపికతోపాటు పుర ప్రజలకు ఆకర్షనీయమైన హామీలను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మాజీ ఎమ్మెల్సీ మాకంరెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో 11మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. అన్ని వర్గాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోలో అంశాలపై దృష్టి సారించారు.

ఇప్పటికే కమిటీ రూపకల్పన చేసిన ముసాయిదా మేనిఫెస్టో పీసీసీకి అందగా ఆయా అంశాలపై మంగళవారం చర్చించారు. అర్హులైన ప్రతి కుటుంబం ఇల్లు నిర్మించుకోడానికి రూ. 9 లక్షల గ్రాంటుతో 150 చదరపు గజాలు స్థలం ఉచితంగా ఇవ్వడం, వ్యవసాయం మీద ఆధారపడిన అన్ని మున్సిపాలిటీల్లో ఎంఎన్‌ఆర్‌జీఏ అమలు చేయాలని సూచించింది. ప్రతి మున్సిపాలిటీలో పూర్తి స్థాయి మౌలిక వసతులతో కూడిన వంద పడకల ఆసుపత్రి, ఐదెకరాల స్థలంలో జూనియర్, డిగ్రీ కళాశాలల నిర్మాణం, విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం, శ్మశానవాటికలకు పదెకరాల స్థలం ఏర్పాటు చేయాలని సూచించింది.

ఆధునిక వసతులతో ధోభీఘాట్​ల నిర్మాణం, క్షురుకులకు షాపుల ఏర్పాటుకు ఉచితంగా స్థలం, కుమ్మరి సంఘాలకు పదెకరాల స్థలం, ఉపాధికి నైపుణ్య అభివృద్ధి సంస్థల ఏర్పాటు, రవాణా కార్మికుల కోసం ప్రత్యేక రవాణా బోర్డుతోపాటు ఉచిత వైద్యం, కుటుంబానికి ఆరోగ్య బీమా, గిరిజన మున్సిపాలిటీల్లో గిరిజన సంస్కృతిని కాపాడేందుకు చర్యలు తదితర అంశాలను మేనిఫెస్టో కమిటీ ముసాయిదాలో చేర్చింది. పీసీసీ పూర్తిస్థాయిలో చర్చించి సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు, పార్టీ అధిష్ఠానం అనుమతితో తుది మేనిఫెస్టో రూపకల్పన చేస్తుంది.

ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పుర ఎన్నికల మేనిఫెస్టో

ఇదీ చదవండిః చంద్రబాబును ఆయన నివాసానికి తరలించిన పోలీసులు

పురపాలక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్ధుల ఎంపికతోపాటు పుర ప్రజలకు ఆకర్షనీయమైన హామీలను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మాజీ ఎమ్మెల్సీ మాకంరెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో 11మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. అన్ని వర్గాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోలో అంశాలపై దృష్టి సారించారు.

ఇప్పటికే కమిటీ రూపకల్పన చేసిన ముసాయిదా మేనిఫెస్టో పీసీసీకి అందగా ఆయా అంశాలపై మంగళవారం చర్చించారు. అర్హులైన ప్రతి కుటుంబం ఇల్లు నిర్మించుకోడానికి రూ. 9 లక్షల గ్రాంటుతో 150 చదరపు గజాలు స్థలం ఉచితంగా ఇవ్వడం, వ్యవసాయం మీద ఆధారపడిన అన్ని మున్సిపాలిటీల్లో ఎంఎన్‌ఆర్‌జీఏ అమలు చేయాలని సూచించింది. ప్రతి మున్సిపాలిటీలో పూర్తి స్థాయి మౌలిక వసతులతో కూడిన వంద పడకల ఆసుపత్రి, ఐదెకరాల స్థలంలో జూనియర్, డిగ్రీ కళాశాలల నిర్మాణం, విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం, శ్మశానవాటికలకు పదెకరాల స్థలం ఏర్పాటు చేయాలని సూచించింది.

ఆధునిక వసతులతో ధోభీఘాట్​ల నిర్మాణం, క్షురుకులకు షాపుల ఏర్పాటుకు ఉచితంగా స్థలం, కుమ్మరి సంఘాలకు పదెకరాల స్థలం, ఉపాధికి నైపుణ్య అభివృద్ధి సంస్థల ఏర్పాటు, రవాణా కార్మికుల కోసం ప్రత్యేక రవాణా బోర్డుతోపాటు ఉచిత వైద్యం, కుటుంబానికి ఆరోగ్య బీమా, గిరిజన మున్సిపాలిటీల్లో గిరిజన సంస్కృతిని కాపాడేందుకు చర్యలు తదితర అంశాలను మేనిఫెస్టో కమిటీ ముసాయిదాలో చేర్చింది. పీసీసీ పూర్తిస్థాయిలో చర్చించి సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు, పార్టీ అధిష్ఠానం అనుమతితో తుది మేనిఫెస్టో రూపకల్పన చేస్తుంది.

ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పుర ఎన్నికల మేనిఫెస్టో

ఇదీ చదవండిః చంద్రబాబును ఆయన నివాసానికి తరలించిన పోలీసులు

TG_HYD_07_09_CONG_MANIFESTO_PKG_3038066 Reporter: M.Tirupal Reddy Dry ()అన్ని వర్గాల ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్‌ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టో ముసాయిదా సిద్దమైంది. అర్హులైన కుటుంబాలకు ఉచిత ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.9లక్షలు గ్రాంట్‌, 750 చదరపు గజాలలోపు ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు, విద్యార్ధులకు ఉచిత రవాణా లాంటి 18 అంశాలతో మ్యానిఫెస్టో తయారైంది. మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ మాకంరెడ్డి రంగారెడ్డి నివేదించిన ఈ మ్యానిఫెస్టోపై పార్టీలో చర్చించిన తరువాత పీసీసీ తుదిరూపు ఇవ్వనుంది. LOOK వాయిస్ఓవర్‌1: పురపాలక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్ధుల ఎంపికతోపాటు పుర ప్రజలకు ఆకర్షనీయమైన హామీలను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. పీసీసీ ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్సీ మాకం రెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో 11మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ ముసాయిదా మ్యానిఫెస్టో రూపకల్పన చేసింది. అన్ని వర్గాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని మ్యానిఫెస్టోలో అంశాలపై దృష్టి సారించారు. నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు సహా వివిధ వర్గాలకు చెందిన అంశాలను చేర్చారు. అంతర్గత రహదారులు, సీసీ కెమెరాల ఏర్పాటు, భూగర్భ డ్రైనేజీ, ఎల్ ఈ డి విధి దీపాల ఏర్పాటు, వాన నీటి సంరక్షణ, ప్రతి వార్డుకు వాటర్ పిలటర్ల ఏర్పాటు, దోమల నిర్మూలన, వీధి కుక్కల సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ, పార్కుల అభివృద్ధి, గ్రీన్ బెల్టుల ఏర్పాటు, బతుకమ్మ ఘాట్ల నిర్మాణం తదితర అంశాలను మ్యానిఫెస్టోలో ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. వాయిస్ ఓవర్2: ఇప్పటికే కమిటీ రూపకల్పన చేసిన ముసాయిదా మ్యానిఫెస్టో పీసీసీకి అందడంతో...ఆయా అంశాలపై మంగళవారం జరిగిన సీనియర్ల సమావేశంలో చర్చ జరిగింది. మ్యానిఫెస్టో కమిటీ సిద్ధం చేసిన ముసాయిదా మ్యానిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...అర్హులైన ప్రతి కుటుంబం ఇల్లు నిర్మించుకోడానికి రూ. 9 లక్షల గ్రాంటుతో 150 చదరపు గజాలు స్థలం ఉచితంగా ఇవ్వడం, వ్యవసాయం మీద ఆధారపడిన అన్ని మునిసిపాలిటీలలో ఎంఎన్‌ఆర్‌జీఎ అమలు చేయాలని సూచించింది. ప్రతి మునిసిపాలిటీలో పూర్తి స్థాయి మౌళిక వసతులతో కూడిన వంద పడకల ఆసుపత్రి, ప్రతి మునిసిపాలిటీలో ఐదు ఎకరాల స్థలంలో జూనియర్, డిగ్రీ కళాశాలల నిర్మాణం, విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం, నిరుద్యోగ యువతకు రుణాలు, ఉద్యోగ మేళాల నిర్వహణ, ప్రతి స్వయం సహాయక సంఘానికి రూ.25 లక్షలు రుణం, స్మశానవాటికలకు పడెకరా స్థలం, ప్రతి మున్సిపాలిటీ లో మహిళలకు గ్రీవియెన్స్ రిడ్రెసల్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆధునిక వసతులతో ధోభీఘాట్ ల నిర్మాణం, క్షురుకులకు షాపుల ఏర్పాటుకు ఉచితంగా స్థలం, కుమ్మరి సంఘాలకు పడెకరాల స్థలం, షాదీఖానా, ఈద్గా, స్మశాన వాటికల నిర్మాణం, అత్యాధునిక వసతులతో స్టేడియం నిర్మాణం, ఉపాధికి నైపుణ్య అభివృద్ధి సంస్థలు ఏర్పాటు, రవాణా కార్మికుల కోసం ప్రత్యేకంగా రవాణా బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు వారికి ఉచిత వైద్యము, కుటుంబానికి ఆరోగ్య బీమా, గిరిజన మున్సిపాలిటీల్లో గిరిజన సంస్కృతిని కాపాడేందుకు చర్యలు, పాఠశాల ఫీజుల నియంత్రణ తదితర అంశాలను మేనిఫెస్టో కమిటీ ముసాయిదాలో చేర్చింది. పీసీసీ పూర్తిస్థాయిలో చర్చించి సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు, పార్టీ అధిష్టానం అనుమతితో తుది మ్యానిఫెస్టో రూపకల్పన చేస్తుంది. end...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.