ETV Bharat / state

దీపాలు ఆర్పివేయమనడం వెనుక కారణాలు ఏమిటి?: వీహెచ్​ - విద్యుత్​ దీపాలు ఆర్పివేయమనడం వెనుక కారణాలపై వీహెచ్​ విమర్శలు

ఇవాళ రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల పాటు దీపాలు ఆపివేయాలని సూచించిన ప్రధాని... దానికి గల కారణాలు ఏమిటో తెలిపాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు డిమాండ్​ చేశారు. ఉద్దేశపూర్వకంగానే భాజపా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు.

congress senior leader v hanumantharao press meet
దీపాలు ఆర్పివేయమనడం వెనక కారణాలు ఏమిటి?: వీహెచ్​
author img

By

Published : Apr 5, 2020, 4:58 PM IST

రాత్రి తొమ్మిది గంటల సమయంలో తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్​ దీపాలు ఆర్పివేసి... దీపాలు వెలిగించమని ప్రధాని సూచన వెనక ఆంతర్యం ఏమిటో చెప్పాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంత రావు డిమాండ్​ చేశారు. భాజపా నేతలు పార్టీ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలా చేయడానికి శాస్త్రీయ కారణాలున్నాయా... కరోనా వైరస్​కు విద్యుత్​ దీపాలు ఆర్పివేయమనడానికి కారణాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు.

గతంలో జనతా పార్టీ నుంచి 1980 ఏప్రిల్​6న భాజపా ఆవిర్భవించిందని అందుకోసమే ఆ ముందు రోజు ప్రజలందరు కొవ్వొత్తులతో సంఘీభావం తెలిపే విధంగా మోదీ ఆలోచించారని వీహెచ్​ ఆరోపించారు. భాజపా ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగానే ఈ కార్యక్రమం చేపడుతున్నారని విమర్శించారు. ఈ విషయం ముందే ప్రజలకు చెప్పి ఉండాల్సిందని ఆయన ఆక్షేపించారు.

స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్​ సంస్థలు వివిధ జిల్లాల్లో పని చేస్తున్న పాత్రికేయులకు సహాయం చేయాలని సూచించారు. కరోనా పోరాటంలో మీడియా పాత్ర కీలకమైనదని ఆయన కొనియాడారు.

దీపాలు ఆర్పివేయమనడం వెనక కారణాలు ఏమిటి?: వీహెచ్​

ఇదీ చూడండి: 25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!

రాత్రి తొమ్మిది గంటల సమయంలో తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్​ దీపాలు ఆర్పివేసి... దీపాలు వెలిగించమని ప్రధాని సూచన వెనక ఆంతర్యం ఏమిటో చెప్పాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంత రావు డిమాండ్​ చేశారు. భాజపా నేతలు పార్టీ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలా చేయడానికి శాస్త్రీయ కారణాలున్నాయా... కరోనా వైరస్​కు విద్యుత్​ దీపాలు ఆర్పివేయమనడానికి కారణాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు.

గతంలో జనతా పార్టీ నుంచి 1980 ఏప్రిల్​6న భాజపా ఆవిర్భవించిందని అందుకోసమే ఆ ముందు రోజు ప్రజలందరు కొవ్వొత్తులతో సంఘీభావం తెలిపే విధంగా మోదీ ఆలోచించారని వీహెచ్​ ఆరోపించారు. భాజపా ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగానే ఈ కార్యక్రమం చేపడుతున్నారని విమర్శించారు. ఈ విషయం ముందే ప్రజలకు చెప్పి ఉండాల్సిందని ఆయన ఆక్షేపించారు.

స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్​ సంస్థలు వివిధ జిల్లాల్లో పని చేస్తున్న పాత్రికేయులకు సహాయం చేయాలని సూచించారు. కరోనా పోరాటంలో మీడియా పాత్ర కీలకమైనదని ఆయన కొనియాడారు.

దీపాలు ఆర్పివేయమనడం వెనక కారణాలు ఏమిటి?: వీహెచ్​

ఇదీ చూడండి: 25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.