ETV Bharat / state

'డబుల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది'

author img

By

Published : Nov 2, 2020, 5:06 PM IST

హైదరాబాద్ నగరంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. నెక్లెస్​రోడ్​లోని అంబేడ్కర్ బస్తీలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్​రూం ఇళ్లను ఆయన పరిశీలించారు.

'డబుల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది'
'డబుల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది'

డబుల్​బెడ్​రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ సీనియర్​ నేత మర్రి శశిధర్​ రెడ్డి ఆరోపించారు. ఏడాదిలోగా ఇళ్లు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. నెక్లెస్​రోడ్డులోని అంబేడ్కర్​ బస్తీలో నిర్మాణంలో ఉన్న రెండు పడకగదుల ఇళ్లను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు.

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు.. ఇంటి అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద ఆర్థిక సహాయం రూ.10 వేలు కూడా అధికార పార్టీకి చెందిన వారికే పంపిణీ చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి... హామీలు నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.

డబుల్​బెడ్​రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ సీనియర్​ నేత మర్రి శశిధర్​ రెడ్డి ఆరోపించారు. ఏడాదిలోగా ఇళ్లు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. నెక్లెస్​రోడ్డులోని అంబేడ్కర్​ బస్తీలో నిర్మాణంలో ఉన్న రెండు పడకగదుల ఇళ్లను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు.

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు.. ఇంటి అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద ఆర్థిక సహాయం రూ.10 వేలు కూడా అధికార పార్టీకి చెందిన వారికే పంపిణీ చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి... హామీలు నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: 'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.