చెరువును శుద్ధిచేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో పటేల్ కుంట చెరువును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ బాధ్యుడు రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు. ఐదేళ్లుగా చెరువులో వ్యర్థాలు తొలగించడం లేదన్నారు.
దీనివల్ల దోమల బెడద పెరిగి కాలనీవాసులు డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజల ఇళ్లలోకి మురుగు నీరు వస్తోందని, ప్రభుత్వం చెరువును శద్ధిచేసేవరకు ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.