అపోలో ఆస్పత్రి కంప్యూటర్ సాఫ్ట్వేర్ వైరస్ బారిన పడింది. ఈ మేరకు ఆస్పత్రి ప్రతినిధులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెసియా వీఎస్ఏ అనే యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ సంస్థతో అపోలో ఆస్పత్రి ఒప్పందం చేసుకుంది.
ఆస్పత్రి సాఫ్ట్వేర్ నిర్వాహకులకు సమాచారం లేకుండా... సదరు సంస్థ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసింది. ఈ క్రమంలో ఆస్పత్రిలోని కంప్యూటర్లన్నీ క్రాష్ అయ్యాయి. అయితే డేటా మాత్రం సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆస్పత్రి జనరల్ మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: మళ్లీ డ్రగ్స్ కలకలం.. భయంతో బాత్రూంలో దాక్కున్న నటి!