ETV Bharat / state

కేసీఆర్​ సభపై ఎస్​ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

author img

By

Published : Nov 28, 2020, 10:01 AM IST

Updated : Nov 28, 2020, 10:32 AM IST

కేసీఆర్​ సభపై కాంగ్రెస్​ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెరాస ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

Complaint to Congress State Election Commission against KCR
కేసీఆర్​ సభపై కాంగ్రెస్​ ఎస్​ఈసీకి ఫిర్యాదు

కేసీఆర్​ సభతో తెరాస ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కాంగ్రెస్​ ఫిర్యాదు చేసింది. ఎల్బీ స్టేడియం, చుట్టుపక్కల ఉన్న ప్రజా ఆస్తులపై తెరాస పార్టీ జెండాలను ప్రదర్శించడం నియమావళికి వ్యతిరేకమని టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ నిరంజన్ వెల్లడించారు. ​

''ఎల్బీ స్టేడియంలో జరగనున్న కేసీఆర్​ బహిరంగ సమావేశానికి మాత్రమే అనుమతినిచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ.. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేసేందుకు కాదని''.. ఎస్​ఈసీకి వివరించారు. నియమావళిని ఉల్లంఘించి ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఉల్లంఘనలకు చెందిన వీడియో క్లిప్పింగ్‌తో ఈసీకి ఫిర్యాదు చేశారు.

కేసీఆర్​ సభతో తెరాస ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కాంగ్రెస్​ ఫిర్యాదు చేసింది. ఎల్బీ స్టేడియం, చుట్టుపక్కల ఉన్న ప్రజా ఆస్తులపై తెరాస పార్టీ జెండాలను ప్రదర్శించడం నియమావళికి వ్యతిరేకమని టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ నిరంజన్ వెల్లడించారు. ​

''ఎల్బీ స్టేడియంలో జరగనున్న కేసీఆర్​ బహిరంగ సమావేశానికి మాత్రమే అనుమతినిచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ.. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేసేందుకు కాదని''.. ఎస్​ఈసీకి వివరించారు. నియమావళిని ఉల్లంఘించి ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఉల్లంఘనలకు చెందిన వీడియో క్లిప్పింగ్‌తో ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: నేడు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్​ బహిరంగ సభ

Last Updated : Nov 28, 2020, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.