ETV Bharat / state

'రైతుల జీవితాల్లో వసంతాలు తెచ్చి.. పున్నవి వెలుగులు నింపడమే లక్ష్యం'

author img

By

Published : Apr 12, 2021, 7:46 PM IST

Updated : Apr 13, 2021, 7:11 AM IST

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ప్రసిద్ధి గాంచిన ఉగాది శుభాలు కలుగజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రైతులకు అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

cm
ఉగాది

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్... శ్రీ ప్లవ నామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవ నామ సంవత్సర ప్రాధాన్యతగా నీరు సమృద్ధిగా ప్రవహిస్తుందని పంచాంగాలు చెబుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమన్నారు.

మంచిచెడుల కలయిక...

వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ప్రసిద్ధి గాంచిన ఉగాది... ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ పక్షుల కిలకిలా రావాలతో ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతును వ్యవసాయానికి సంసిద్ధం చేసే ఉగాది రైతు జీవితంలో భాగమై పోయిందన్న ఆయన... అప్పుడప్పుడే చిగురించే వేపపూత, మామిడి కాత, చేతికందే చింతపండులాంటి ప్రకృతి ఫలాలను తీపి, వగరు, చేదు రుచుల పచ్చడి సేవించి పండుగను జరుపుకోవడం గొప్ప సందేశాన్నిస్తుందన్నారు.

సంప్రదాయానికి చిహ్నం...

జీవితంలోని కష్టసుఖాలు, మంచి చెడుల వంటి జీవిత సారాన్ని తాత్వికంగా గుర్తుచేసుకునే గొప్ప సజీవ సంప్రదాయానికి చిహ్నంగా ఉగాది పచ్చడిని సేవిస్తారని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలనలోని చేదు అనుభవాలను చవిచూసిన తెలంగాణ రైతు... స్వయంపాలనలో తియ్యటి ఫలాలను అనుభవిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఆనకట్టలు కట్టి, సొరంగాలు తవ్వి, లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి నదీజలాలను సాగరమట్టానికి ఎత్తుమీద వున్న బీడుభూములకు మళ్లించామని గుర్తు చేశారు.

కాళేశ్వరానికి ప్రశంసలు...

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రశంసలను అందుకుంటోందని, మండే వేసవిలోనూ చెరువులను నిండుకుండలుగా మార్చి, రైతులకు పసిడి పంటలను అందిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల, ఇతర నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను మరికొద్ది నెలల్లో పూర్తి చేసుకోబోతున్నామన్న సీఎం... పండించిన పంటను ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసి రైతును కరోనా కష్టకాలంలో ఆదుకుంటోందని చెప్పారు.

అండగా ప్రభుత్వం...

తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలిచిందన్న కేసీఆర్... విమర్శకుల అంచనాలను తారుమారు చేసి పంటల సాగు, ధాన్యం దిగుబడిలో దేశంలోనే మొదటి స్థానానికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందిస్తున్న భరోసాతో రైతు కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయని, విత్తనం నాటిన నుంచి పంట ఫలం చేతికొచ్చేదాకా రైతులకు అన్నిరకాల సాయం అందిస్తున్న ప్రభుత్వం వారి కష్టాలను తన భుజాల మీదికి ఎత్తుకుందని సీఎం తెలిపారు.

రైతు కుటుంబాల్లో వసంతం...

ఉమ్మడి రాష్ట్ర పాలనలో దండుగన్న తెలంగాణ వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగగా మార్చిందని... వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దఎత్తున ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు తదితర రైతు సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి పథకాల అమలు కోసం ప్రతి ఏటా సుమారు రూ.50 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు కుటుంబాల జీవితాల్లో వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెలలను నింపడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఈసారి నిరాడంబరంగా ఉగాది వేడుకలు: రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్... శ్రీ ప్లవ నామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవ నామ సంవత్సర ప్రాధాన్యతగా నీరు సమృద్ధిగా ప్రవహిస్తుందని పంచాంగాలు చెబుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమన్నారు.

మంచిచెడుల కలయిక...

వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ప్రసిద్ధి గాంచిన ఉగాది... ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ పక్షుల కిలకిలా రావాలతో ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతును వ్యవసాయానికి సంసిద్ధం చేసే ఉగాది రైతు జీవితంలో భాగమై పోయిందన్న ఆయన... అప్పుడప్పుడే చిగురించే వేపపూత, మామిడి కాత, చేతికందే చింతపండులాంటి ప్రకృతి ఫలాలను తీపి, వగరు, చేదు రుచుల పచ్చడి సేవించి పండుగను జరుపుకోవడం గొప్ప సందేశాన్నిస్తుందన్నారు.

సంప్రదాయానికి చిహ్నం...

జీవితంలోని కష్టసుఖాలు, మంచి చెడుల వంటి జీవిత సారాన్ని తాత్వికంగా గుర్తుచేసుకునే గొప్ప సజీవ సంప్రదాయానికి చిహ్నంగా ఉగాది పచ్చడిని సేవిస్తారని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలనలోని చేదు అనుభవాలను చవిచూసిన తెలంగాణ రైతు... స్వయంపాలనలో తియ్యటి ఫలాలను అనుభవిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఆనకట్టలు కట్టి, సొరంగాలు తవ్వి, లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి నదీజలాలను సాగరమట్టానికి ఎత్తుమీద వున్న బీడుభూములకు మళ్లించామని గుర్తు చేశారు.

కాళేశ్వరానికి ప్రశంసలు...

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రశంసలను అందుకుంటోందని, మండే వేసవిలోనూ చెరువులను నిండుకుండలుగా మార్చి, రైతులకు పసిడి పంటలను అందిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల, ఇతర నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను మరికొద్ది నెలల్లో పూర్తి చేసుకోబోతున్నామన్న సీఎం... పండించిన పంటను ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసి రైతును కరోనా కష్టకాలంలో ఆదుకుంటోందని చెప్పారు.

అండగా ప్రభుత్వం...

తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలిచిందన్న కేసీఆర్... విమర్శకుల అంచనాలను తారుమారు చేసి పంటల సాగు, ధాన్యం దిగుబడిలో దేశంలోనే మొదటి స్థానానికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందిస్తున్న భరోసాతో రైతు కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయని, విత్తనం నాటిన నుంచి పంట ఫలం చేతికొచ్చేదాకా రైతులకు అన్నిరకాల సాయం అందిస్తున్న ప్రభుత్వం వారి కష్టాలను తన భుజాల మీదికి ఎత్తుకుందని సీఎం తెలిపారు.

రైతు కుటుంబాల్లో వసంతం...

ఉమ్మడి రాష్ట్ర పాలనలో దండుగన్న తెలంగాణ వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగగా మార్చిందని... వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దఎత్తున ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు తదితర రైతు సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి పథకాల అమలు కోసం ప్రతి ఏటా సుమారు రూ.50 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు కుటుంబాల జీవితాల్లో వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెలలను నింపడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఈసారి నిరాడంబరంగా ఉగాది వేడుకలు: రాష్ట్ర ప్రభుత్వం

Last Updated : Apr 13, 2021, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.