ETV Bharat / state

పార్లమెంట్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

తెరాసకు చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం ప్రగతిభవన్​లో సమావేశం కానున్నారు. ఈ నెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. జీఎస్టీ విషయంలో కేంద్రం తీరు, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

పార్లమెంట్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
పార్లమెంట్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
author img

By

Published : Sep 10, 2020, 5:01 AM IST

ఈ నెల14 నుంచి పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్​.. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం సమావేశం కానున్నారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించే వ్యూహం సహా.. రాష్ట్రానికి చెందిన పలు అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో కేంద్రం తీరు, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై వివరాలు అందిస్తారు.

ఈ నెల14 నుంచి పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్​.. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం సమావేశం కానున్నారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించే వ్యూహం సహా.. రాష్ట్రానికి చెందిన పలు అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో కేంద్రం తీరు, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై వివరాలు అందిస్తారు.

ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.