ETV Bharat / state

రిజిస్ట్రేషన్లు సంబంధిత అంశాలపై నేడు సీఎం సమీక్ష

author img

By

Published : Nov 15, 2020, 5:00 AM IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రారంభానికి సర్కారు కసరత్తు ప్రారంభించింది. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయింది. రిజిస్ట్రేషన్లు సంబంధిత అంశాలపై నేడు సీఎం కేసీఆర్​ సమీక్ష చేయనున్నారు. ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభించాలని సర్కారు యోచిస్తోంది.

CM KCR review today on issues related to registrations in telangana
రిజిస్ట్రేషన్లు సంబంధిత అంశాలపై నేడు సీఎం సమీక్ష

ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వ్యవసాయ ఆస్తుల ప్రక్రియ సాఫీగా సాగుతోన్న తరుణంలో ఇతర ఆస్తులపై కూడా సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రారంభం, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

అవినీతికి ఆస్కారం లేని పారదర్శక విధానంలో, సులువుగా, సత్వరమే భూలావాదేవీలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా భూ లావాదేవీలు కోర్ బ్యాంకింగ్ విధానంలో ఆన్​లైన్​ పద్ధతిలో జరుగుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సహా ఇతరత్రా లావాదేవీలన్నీ ధరణి ద్వారానే జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్​తోపాటు మ్యుటేషన్ కూడా ఏక కాలంలో చేస్తున్నారు. అటు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను సైతం ధరణి ద్వారా ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. గత రెండు నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో వీలైనంత త్వరగా వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం

ఇళ్లు, ఫ్లాట్ల వివరాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. గ్రామపంచాయతీలు, ఇతర పట్టణాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాగా... జీహెచ్​ఎంసీ సహా శివారు పట్టణాల్లో కొంత మిగిలి ఉంది. మీ సేవా సెంటర్లలో ప్రజలు కూడా వారి ఆస్తుల వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయరాదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటన్నింటి నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

ఇదీ చూడండి : 'దీపావళి వేడుకలను సరిహద్దుల్లోని సైనికులకు అంకితమిస్తున్నా..'

ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వ్యవసాయ ఆస్తుల ప్రక్రియ సాఫీగా సాగుతోన్న తరుణంలో ఇతర ఆస్తులపై కూడా సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రారంభం, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

అవినీతికి ఆస్కారం లేని పారదర్శక విధానంలో, సులువుగా, సత్వరమే భూలావాదేవీలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా భూ లావాదేవీలు కోర్ బ్యాంకింగ్ విధానంలో ఆన్​లైన్​ పద్ధతిలో జరుగుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సహా ఇతరత్రా లావాదేవీలన్నీ ధరణి ద్వారానే జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్​తోపాటు మ్యుటేషన్ కూడా ఏక కాలంలో చేస్తున్నారు. అటు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను సైతం ధరణి ద్వారా ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. గత రెండు నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో వీలైనంత త్వరగా వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం

ఇళ్లు, ఫ్లాట్ల వివరాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. గ్రామపంచాయతీలు, ఇతర పట్టణాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాగా... జీహెచ్​ఎంసీ సహా శివారు పట్టణాల్లో కొంత మిగిలి ఉంది. మీ సేవా సెంటర్లలో ప్రజలు కూడా వారి ఆస్తుల వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయరాదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటన్నింటి నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

ఇదీ చూడండి : 'దీపావళి వేడుకలను సరిహద్దుల్లోని సైనికులకు అంకితమిస్తున్నా..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.