ETV Bharat / state

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: సీఎం - telangana varthalu

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాన్ని కృష్ణా జలాలతో తడపాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో అనుసంధానించి నీరందించే ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పాలమూరుతో పాటు జిల్లాను ఆనుకుని వున్న తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగునీటిని అందించేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్​లో సాగిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాల పనులను విస్తరించడం కోసం సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళికలను, కార్యాచరణను అధికారులకు పాలమూరు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు.

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: సీఎం
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: సీఎం
author img

By

Published : Mar 23, 2021, 1:39 AM IST

Updated : Mar 23, 2021, 6:54 AM IST

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: సీఎం

కృష్ణా నదీ ప్రవాహం అక్టోబర్ నెల వరకే కొనసాగుతుందని, ఈ లోపు తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను వీలైనంతగా ఎత్తిపోసుకొని పాలమూరు ఎండిన బీళ్లను తడుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉన్నదని, అందులో ఏర్పాటు చేసుకున్న రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండటంతో దాని పరిధిలోని ఆయకట్టుకు నీరందడం కష్టమన్నారు. కల్వకుర్తి లిఫ్టు ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించేందుకు పాలమూరు లిఫ్టు పనులను వేగవంతంగా కొనసాగించి, ఎక్కడికక్కడే అనుసంధానించుకోవాలని అధికారులకు సూచించారు. అందులో భాగంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్​ను నింపుకొని కొడంగల్, నారాయణ పేట్, పరిగి, తాండూర్, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల పరిధిలో సాగుభూములకు గ్రావిటీ ద్వారా నీరందించే అవకాశాలను సీఎం మ్యాపుల ద్వారా పరిశీలించి, అధికారులతో చర్చించారు. అందుకు సంబంధించి ప్రధాన కాలువల నిర్మాణం సహా, ప్రతి చెరువును నింపే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

అధికారులతో సుదీర్ఘ చర్చ

కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నీరందకుండా ఉన్న సాగు భూములను సైతం తడపాలన్నారు. మహబూబ్ నగర్ నుంచి కిందికి ఉన్న భూములకు సాగునీరందించే విధి, విధానాలపై చర్చించిన సీఎం.. పైకి నీళ్లను తీసుకెళ్లి, తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు నీరందించేలా కాల్వల నిర్మాణంపై చర్చించారు. కాల్వలు, వాగుల ద్వారా నీటిని తీసుకెళ్లే క్రమంలో చెక్ డ్యాములు పటిష్టంగా ఏర్పాటు చేసి చెరువులు నింపుకోవాలన్నారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని భూత్పూర్, ఘన్​పూర్, మూసాపేట, అడ్డకల్ మండలాల్లో తాగునీటిని తీసుకెళ్లే మార్గాలను సీఎం డిజిటల్ స్క్రీన్ పై అన్వేషించారు. కాంటూరు లెవల్స్​ను పరిశీలించారు. వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీటిని మహబూబ్ నగర్ జిల్లా చుట్టూ ఎట్లా తిప్పవచ్చనే విషయమై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరం పనులు పూర్తైనందున ఇక నుంచి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని, వారం వారం క్షేత్రస్థాయి పర్యటనలు కూడా జరపాలని పునరుద్ఘాటించారు. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన భూసేకరణ, నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్ అండ్ ఆర్ వ్యవహారాలను స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. ఇక నుంచి పర్యటనలు మొదలవుతున్నందున అనువైన చోట ఒక గెస్టు హౌజ్​ను నిర్మించాలని సూచించారు.

యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలి..

యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసుకున్నామని.. అదే స్ఫూర్తితో పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు. సీతారామ, డిండి ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులే.. వాటికి కావాల్సిన నిధులన్నీ సంపూర్ణంగా సమకూర్చుతామని స్పష్టం చేశారు. పాలమూరు-కల్వకుర్తి, పాలమూరు-జూరాల పథకాలను అనుసంధానం చేయడం ద్వారా మాత్రమే ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేసుకోవచ్చన్నారు. అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీం సర్వే పనులను సత్వరమే పూర్తిచేసి, ఎస్టిమేట్లను పరిపాలనా అనుమతులకోసం పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

సాగు నీరందించాలి..

బల్మూర్, లింగాల అమ్రాబాద్ ప్రాంతంలో 60 వేల ఎకరాలకు సాగు నీరందించాలని.. ఇందుకోసం ఏదుల రిజర్వాయర్ నుంచి 22 కిలోమీటర్లు కాల్వ తీసి, లింగాల దగ్గర లిఫ్టును ఏర్పాటు చేయాలన్నారు. అక్కడినుంచి మైలారం దగ్గర మూడు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్​ను ఏర్పాటు చేయాలన్నారు. దానికి ఉమా మహేశ్వరం అనే పేరును సీఎం సూచించారు. అక్కడినుంచి చంద్రసాగర్​కు కాల్వ ద్వారా నీరందించి, అక్కడినుంచి అమ్రాబాద్ మండలంలోని మున్ననూరులో 1.4 టీఎంసీ సామర్థ్యంతో ఒక రిజర్వాయర్​ను ఏర్పాటు చేసి, ఎత్తిపోయాలన్నారు. ఈ రిజర్వాయర్​కు స్థానిక చారిత్రక నేపథ్యమున్న చెన్నకేశవుని పేరును పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు సంబంధించిన సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని.. మే నెలలో శంకుస్థాపన చేసుకోవాలన్నారు. కోయిల్ సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడానికి గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజోలిబండ ప్రాజెక్టు పరిధిలో ఉన్న చిన్నోనిపల్లి రిజర్వాయర్, ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణ పనులు, తుమ్మిళ్ల లిఫ్టు మిగిలిపోయిన పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జూరాల నీటిలభ్యతను పెంచుకోవాలి..

గట్టు రిజర్వాయర్​ను మూడు టీఎంసీల సామర్థ్యానికి పెంచాలని ఆదేశించారు. జూరాల మీద ఆధారపడిన నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, జూరాల సొంత ఆయకట్టుతోపాటు, మిషన్ భగీరథకు నిరంతరం నీరందించే బరువంతా జూరాలపైనే ఉన్నందున అక్కడ నీటి లభ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా పాలమూరు- జూరాలను అనుసంధానం చేయడం వల్ల సహజమైన నీరు, రీ జనరేటెడ్ వాటర్, కెనాల్ నీటితో సంవత్సరం పొడవునా కళకళలాడుతుందన్నారు. జూరాల పరిధిలో 24 మున్సిపాలిటీలు, గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు నీరందించే వెసులుబాటు తద్వారా కలుగుతుందన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: సీఎం

కృష్ణా నదీ ప్రవాహం అక్టోబర్ నెల వరకే కొనసాగుతుందని, ఈ లోపు తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను వీలైనంతగా ఎత్తిపోసుకొని పాలమూరు ఎండిన బీళ్లను తడుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉన్నదని, అందులో ఏర్పాటు చేసుకున్న రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండటంతో దాని పరిధిలోని ఆయకట్టుకు నీరందడం కష్టమన్నారు. కల్వకుర్తి లిఫ్టు ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించేందుకు పాలమూరు లిఫ్టు పనులను వేగవంతంగా కొనసాగించి, ఎక్కడికక్కడే అనుసంధానించుకోవాలని అధికారులకు సూచించారు. అందులో భాగంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్​ను నింపుకొని కొడంగల్, నారాయణ పేట్, పరిగి, తాండూర్, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల పరిధిలో సాగుభూములకు గ్రావిటీ ద్వారా నీరందించే అవకాశాలను సీఎం మ్యాపుల ద్వారా పరిశీలించి, అధికారులతో చర్చించారు. అందుకు సంబంధించి ప్రధాన కాలువల నిర్మాణం సహా, ప్రతి చెరువును నింపే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

అధికారులతో సుదీర్ఘ చర్చ

కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నీరందకుండా ఉన్న సాగు భూములను సైతం తడపాలన్నారు. మహబూబ్ నగర్ నుంచి కిందికి ఉన్న భూములకు సాగునీరందించే విధి, విధానాలపై చర్చించిన సీఎం.. పైకి నీళ్లను తీసుకెళ్లి, తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు నీరందించేలా కాల్వల నిర్మాణంపై చర్చించారు. కాల్వలు, వాగుల ద్వారా నీటిని తీసుకెళ్లే క్రమంలో చెక్ డ్యాములు పటిష్టంగా ఏర్పాటు చేసి చెరువులు నింపుకోవాలన్నారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని భూత్పూర్, ఘన్​పూర్, మూసాపేట, అడ్డకల్ మండలాల్లో తాగునీటిని తీసుకెళ్లే మార్గాలను సీఎం డిజిటల్ స్క్రీన్ పై అన్వేషించారు. కాంటూరు లెవల్స్​ను పరిశీలించారు. వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీటిని మహబూబ్ నగర్ జిల్లా చుట్టూ ఎట్లా తిప్పవచ్చనే విషయమై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరం పనులు పూర్తైనందున ఇక నుంచి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని, వారం వారం క్షేత్రస్థాయి పర్యటనలు కూడా జరపాలని పునరుద్ఘాటించారు. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన భూసేకరణ, నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఆర్ అండ్ ఆర్ వ్యవహారాలను స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. ఇక నుంచి పర్యటనలు మొదలవుతున్నందున అనువైన చోట ఒక గెస్టు హౌజ్​ను నిర్మించాలని సూచించారు.

యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలి..

యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసుకున్నామని.. అదే స్ఫూర్తితో పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు. సీతారామ, డిండి ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులే.. వాటికి కావాల్సిన నిధులన్నీ సంపూర్ణంగా సమకూర్చుతామని స్పష్టం చేశారు. పాలమూరు-కల్వకుర్తి, పాలమూరు-జూరాల పథకాలను అనుసంధానం చేయడం ద్వారా మాత్రమే ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేసుకోవచ్చన్నారు. అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీం సర్వే పనులను సత్వరమే పూర్తిచేసి, ఎస్టిమేట్లను పరిపాలనా అనుమతులకోసం పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

సాగు నీరందించాలి..

బల్మూర్, లింగాల అమ్రాబాద్ ప్రాంతంలో 60 వేల ఎకరాలకు సాగు నీరందించాలని.. ఇందుకోసం ఏదుల రిజర్వాయర్ నుంచి 22 కిలోమీటర్లు కాల్వ తీసి, లింగాల దగ్గర లిఫ్టును ఏర్పాటు చేయాలన్నారు. అక్కడినుంచి మైలారం దగ్గర మూడు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్​ను ఏర్పాటు చేయాలన్నారు. దానికి ఉమా మహేశ్వరం అనే పేరును సీఎం సూచించారు. అక్కడినుంచి చంద్రసాగర్​కు కాల్వ ద్వారా నీరందించి, అక్కడినుంచి అమ్రాబాద్ మండలంలోని మున్ననూరులో 1.4 టీఎంసీ సామర్థ్యంతో ఒక రిజర్వాయర్​ను ఏర్పాటు చేసి, ఎత్తిపోయాలన్నారు. ఈ రిజర్వాయర్​కు స్థానిక చారిత్రక నేపథ్యమున్న చెన్నకేశవుని పేరును పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు సంబంధించిన సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని.. మే నెలలో శంకుస్థాపన చేసుకోవాలన్నారు. కోయిల్ సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడానికి గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజోలిబండ ప్రాజెక్టు పరిధిలో ఉన్న చిన్నోనిపల్లి రిజర్వాయర్, ఆర్డీఎస్ కాలువ ఆధునికీకరణ పనులు, తుమ్మిళ్ల లిఫ్టు మిగిలిపోయిన పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జూరాల నీటిలభ్యతను పెంచుకోవాలి..

గట్టు రిజర్వాయర్​ను మూడు టీఎంసీల సామర్థ్యానికి పెంచాలని ఆదేశించారు. జూరాల మీద ఆధారపడిన నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, జూరాల సొంత ఆయకట్టుతోపాటు, మిషన్ భగీరథకు నిరంతరం నీరందించే బరువంతా జూరాలపైనే ఉన్నందున అక్కడ నీటి లభ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా పాలమూరు- జూరాలను అనుసంధానం చేయడం వల్ల సహజమైన నీరు, రీ జనరేటెడ్ వాటర్, కెనాల్ నీటితో సంవత్సరం పొడవునా కళకళలాడుతుందన్నారు. జూరాల పరిధిలో 24 మున్సిపాలిటీలు, గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు నీరందించే వెసులుబాటు తద్వారా కలుగుతుందన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

Last Updated : Mar 23, 2021, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.