ETV Bharat / state

cm kcr: ధాన్యాగారంగా తెలంగాణ.. వ్యవసాయంపై మంత్రివర్గ ఉపసంఘం

author img

By

Published : Jul 14, 2021, 5:32 PM IST

రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యం పెంచుకోవాలని సీఎం కేసీఆర్​ సూచించారు. వచ్చే ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతే ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, సాధించిన ప్రగతిపై బుధవారం జరిగిన కేబినెట్​ సమావేశంలో సీఎం కేసీఆర్​ ప్రస్తావించారు.

cm kcr on agriculture
cm kcr on agriculture

రాష్ట్రంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొత్తగా పారాబాయిల్డ్ మిల్లులను గణనీయంగా ఏర్పాటు చేయాలని అన్నారు. రెండో రోజు కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గతేడాది కాలంగా వ్యవసాయరంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు వివరించారు.

వ్యవసాయ ప్రగతిపై చర్చ

వానాకాలం సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. ఏడేళ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, సాధించిన ఘన విజయాలను... సీఎం కేసీఆర్ సమావేశంలో ప్రస్తావించారు. నాణ్యమైన ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములన్నింటినీ రైతులు సాగుచేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో సాగువిస్తీర్ణం పెద్దఎత్తున పెరిగిందన్న ముఖ్యమంత్రి... రైతుబంధు సహా సకాలంలో ఎరువులు, విత్తనాలు, తదితర రైతుసంక్షేమ కార్యక్రమాల ఫలితంగా నిరుడు రికార్డుస్థాయిలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని తెలిపారు. రైతులు మరింత ఉత్సాహంతో వరిధాన్యాన్ని పండించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని తెలిపారు.

రికార్డు స్థాయిలో పండనున్నాయి

ప్రస్తుత వానాకాలంలో కోటి నలభై లక్షల ఎకరాల్లో సాగు జరగనుందని... వరి, పత్తి పంటలు రికార్డుస్థాయిలో పండనున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇపుడున్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని చెప్పారు. రైస్ మిల్లుల్లో మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచాలని... కొత్త పారాబాయిల్డ్ మిల్లులను గణనీయంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకోసం అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమలశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతులకు సమగ్రంగా శిక్షణ నిరంతరం కొనసాగాలని, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ శాఖకు స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని సూచించారు. అవసరమైన రీతిలో అధికారులు, నిపుణులను జోడించి నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయశాఖలో ఖాళీలు ఉండొద్దు

పౌరసరఫరాల శాఖ సహా వ్యవసాయశాఖలో ఎటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉండరాదన్నారు. అన్ని పోస్టులను నింపాలని కేబినెట్ ఆదేశించింది. పండిన ధాన్యాన్ని పండినట్లే ఫుడ్ ప్రాసెసింగ్​లో భాగంగా మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాలని సూచించారు. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. అవసరమైతే ఆయా రంగాల్లో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించింది. కొత్తగా ముందుకొచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.

మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగనున్న నేపథ్యంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్​రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు.

ఇదీ చూడండి: CABINET MEET: రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. ఉద్యోగాల భర్తీపై చర్చ

రాష్ట్రంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొత్తగా పారాబాయిల్డ్ మిల్లులను గణనీయంగా ఏర్పాటు చేయాలని అన్నారు. రెండో రోజు కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గతేడాది కాలంగా వ్యవసాయరంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు వివరించారు.

వ్యవసాయ ప్రగతిపై చర్చ

వానాకాలం సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. ఏడేళ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, సాధించిన ఘన విజయాలను... సీఎం కేసీఆర్ సమావేశంలో ప్రస్తావించారు. నాణ్యమైన ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములన్నింటినీ రైతులు సాగుచేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో సాగువిస్తీర్ణం పెద్దఎత్తున పెరిగిందన్న ముఖ్యమంత్రి... రైతుబంధు సహా సకాలంలో ఎరువులు, విత్తనాలు, తదితర రైతుసంక్షేమ కార్యక్రమాల ఫలితంగా నిరుడు రికార్డుస్థాయిలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని తెలిపారు. రైతులు మరింత ఉత్సాహంతో వరిధాన్యాన్ని పండించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని తెలిపారు.

రికార్డు స్థాయిలో పండనున్నాయి

ప్రస్తుత వానాకాలంలో కోటి నలభై లక్షల ఎకరాల్లో సాగు జరగనుందని... వరి, పత్తి పంటలు రికార్డుస్థాయిలో పండనున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇపుడున్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని చెప్పారు. రైస్ మిల్లుల్లో మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచాలని... కొత్త పారాబాయిల్డ్ మిల్లులను గణనీయంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకోసం అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమలశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతులకు సమగ్రంగా శిక్షణ నిరంతరం కొనసాగాలని, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ శాఖకు స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని సూచించారు. అవసరమైన రీతిలో అధికారులు, నిపుణులను జోడించి నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయశాఖలో ఖాళీలు ఉండొద్దు

పౌరసరఫరాల శాఖ సహా వ్యవసాయశాఖలో ఎటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉండరాదన్నారు. అన్ని పోస్టులను నింపాలని కేబినెట్ ఆదేశించింది. పండిన ధాన్యాన్ని పండినట్లే ఫుడ్ ప్రాసెసింగ్​లో భాగంగా మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాలని సూచించారు. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. అవసరమైతే ఆయా రంగాల్లో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించింది. కొత్తగా ముందుకొచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.

మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగనున్న నేపథ్యంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్​రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు.

ఇదీ చూడండి: CABINET MEET: రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. ఉద్యోగాల భర్తీపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.