ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వ్యాపారాలపై ఈ ఎఫెక్ట్ పడుతోంది. భారత మార్కెట్లపైనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. సినిమా రంగం దీనికి అతీతమేం కాదు.
ఇప్పటికే కేరళ, కర్ణాటకలోని సినీ నిర్మాణ సంస్థలు ప్రత్యేకంగా సమావేశమై మార్చి 31 వరకు సినిమా థియేటర్లను మూసివేశాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని నిర్మాతల మండలి భావిస్తోంది. పైగా కరోనా వ్యాపిస్తుందన్న వదంతులతో ఈ ఉగాదికి విడుదల కావాల్సిన పలు పెద్ద సినిమాలను నిర్మాతలు వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నారు.
ఇవీచూడండి: భారత్లో కరోనాతో మరో వ్యక్తి మృతి