ETV Bharat / state

Christmas Celebrations : జోరందుకున్న క్రిస్మస్‌ సందడి.. ప్రత్యేక అలంకరణలో చర్చి​లు - తెలంగాణలో క్రిస్మస్ వేడుకలు

Christmas Celebrations 2021: క్రైస్తవులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే క్రిస్మస్‌ పండుగ రానే వచ్చింది. ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలను జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇప్పటికే చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో చర్చిలన్నీ విద్యుత్‌ దీప కాంతులతో వెలిగిపోతున్నాయి.

Christmas Celebrations
క్రిస్మస్ వేడుకలు
author img

By

Published : Dec 24, 2021, 5:19 PM IST

క్రిస్మస్ వేడుకలు

Christmas Celebrations 2021: రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి జోరందుకుంది. ప్రత్యేక ప్రార్థనల కోసం చర్చిలను విద్యుత్‌ కాంతులతో సిద్ధం చేస్తున్నారు. గృహాలను ప్రత్యేకంగా అలంకరించుకునేందుకు ధగధగమెరిసే క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు, తోరణాలు శాంతాక్లాజ్ బొమ్మలను క్రైస్తవ సోదరులు ఎక్కవగా కొనుగోలు చేస్తున్నారు. పండుగ నేపథ్యంలో ఆహార ప్రియులను ఆకర్షించేందుకు పలు రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్‌ పార్లర్లు సరికొత్త ఫ్లేవర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

బట్టల పంపిణీ..

హైదరాబాద్‌ రాజ్ భవన్​లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొని రాజ్ భవన్ సిబ్బందికి, వారి పిల్లలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వీట్లు, కానుకలు అందజేశారు. కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని గవర్నర్ ఆకాంక్షించారు. క్రైస్తవ సోదరులకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్​ విప్ వినయభాస్కర్ అన్నారు. హనుమకొండలోని బాపిస్ట్ చర్చిలో క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసిన ఆయన.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పేద క్రైస్తవ సోదరులకు బట్టలను పంపిణీ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో క్రిస్మస్​ వేడుకలు జరిగాయి.

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్‌లోని చర్చిలన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. కాజీపేట్‌లోని కెథడ్రిల్, హనుమకొండలోని సీజీసీ చర్చి, సర్క్యూట్ గెస్ట్ హౌస్ రూధర్ ఫోర్డ్ చర్చిల్లో చేసిన ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంటోంది. విద్యుత్‌ద్దీప కాంతులతో చర్చి పరిసరాలు దేదీప్యమానమౌతున్నాయి.

సరికొత్త ఫ్లేవర్​లతో..

హైదరాబాద్‌లోనూ క్రిస్మస్‌ సందడి జోరందుకుంది. పండుగ నేపథ్యంలో ఆహార ప్రియులను ఆకర్షించేందుకు పలు రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్‌ పార్లర్లు సరికొత్త ఫ్లేవర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. నగరంలోని క్రీమ్‌స్టోన్‌ ఐస్‌క్రీమ్‌ పార్లర్లు క్రిస్మస్‌ కోసం సరికొత్త ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్స్‌, కేక్‌ను సిద్ధం చేసింది. ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్స్‌, కేక్‌లను నగరానికి చెందిన మోడల్స్‌ శాంతాక్లాజ్​తో కలిసి ఆవిష్కరించి సందడి చేశారు. కూకట్‌పల్లి పినాకిల్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల విద్యార్థులు క్రిస్మస్ కేక్‌ను తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. 50 మంది చెఫ్‌లు, 96గంటల సమయంలో 40 మీటర్ల పొడవు ఆరు ఫీట్ల ఎత్తు గల క్రిస్మస్ కేక్‌ను తయారు చేశారు. ఈ భారీ కేక్‌ అందరినీ అబ్బురపరుస్తోంది.

ఇదీ చూడండి: భార్యతో గొడవ... పిల్లలను చంపి.. ఆపై భర్త ఆత్మహత్య

క్రిస్మస్ వేడుకలు

Christmas Celebrations 2021: రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి జోరందుకుంది. ప్రత్యేక ప్రార్థనల కోసం చర్చిలను విద్యుత్‌ కాంతులతో సిద్ధం చేస్తున్నారు. గృహాలను ప్రత్యేకంగా అలంకరించుకునేందుకు ధగధగమెరిసే క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు, తోరణాలు శాంతాక్లాజ్ బొమ్మలను క్రైస్తవ సోదరులు ఎక్కవగా కొనుగోలు చేస్తున్నారు. పండుగ నేపథ్యంలో ఆహార ప్రియులను ఆకర్షించేందుకు పలు రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్‌ పార్లర్లు సరికొత్త ఫ్లేవర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

బట్టల పంపిణీ..

హైదరాబాద్‌ రాజ్ భవన్​లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొని రాజ్ భవన్ సిబ్బందికి, వారి పిల్లలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వీట్లు, కానుకలు అందజేశారు. కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని గవర్నర్ ఆకాంక్షించారు. క్రైస్తవ సోదరులకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్​ విప్ వినయభాస్కర్ అన్నారు. హనుమకొండలోని బాపిస్ట్ చర్చిలో క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసిన ఆయన.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పేద క్రైస్తవ సోదరులకు బట్టలను పంపిణీ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో క్రిస్మస్​ వేడుకలు జరిగాయి.

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్‌లోని చర్చిలన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. కాజీపేట్‌లోని కెథడ్రిల్, హనుమకొండలోని సీజీసీ చర్చి, సర్క్యూట్ గెస్ట్ హౌస్ రూధర్ ఫోర్డ్ చర్చిల్లో చేసిన ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంటోంది. విద్యుత్‌ద్దీప కాంతులతో చర్చి పరిసరాలు దేదీప్యమానమౌతున్నాయి.

సరికొత్త ఫ్లేవర్​లతో..

హైదరాబాద్‌లోనూ క్రిస్మస్‌ సందడి జోరందుకుంది. పండుగ నేపథ్యంలో ఆహార ప్రియులను ఆకర్షించేందుకు పలు రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్‌ పార్లర్లు సరికొత్త ఫ్లేవర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. నగరంలోని క్రీమ్‌స్టోన్‌ ఐస్‌క్రీమ్‌ పార్లర్లు క్రిస్మస్‌ కోసం సరికొత్త ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్స్‌, కేక్‌ను సిద్ధం చేసింది. ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్స్‌, కేక్‌లను నగరానికి చెందిన మోడల్స్‌ శాంతాక్లాజ్​తో కలిసి ఆవిష్కరించి సందడి చేశారు. కూకట్‌పల్లి పినాకిల్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల విద్యార్థులు క్రిస్మస్ కేక్‌ను తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. 50 మంది చెఫ్‌లు, 96గంటల సమయంలో 40 మీటర్ల పొడవు ఆరు ఫీట్ల ఎత్తు గల క్రిస్మస్ కేక్‌ను తయారు చేశారు. ఈ భారీ కేక్‌ అందరినీ అబ్బురపరుస్తోంది.

ఇదీ చూడండి: భార్యతో గొడవ... పిల్లలను చంపి.. ఆపై భర్త ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.