రాగల మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి వెల్లడించింది. రాజస్థాన్ నుంచి తెలంగాణ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి వస్తుందని... ఆ ప్రభావం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గత 20 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులుఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణం చల్లబడి వర్షాలు కురవడంతో పంటలకు కొంత మేలు జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.
ఇదీ చూడండి: AP RAINS: ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు.. రహదారులు జలమయం