ETV Bharat / state

మాజీ ఎంపీ రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు

ఏపీలోని గుంటూరులో మాజీ ఎంపీ, తెదేపా నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్​ట్రాయ్ నిర్మాణ సంస్థ వ్యవహారాలపై సీబీఐ అధికారులు ఉదయం నుంచి విచారణ నిర్వహిస్తున్నారు.

author img

By

Published : Dec 18, 2020, 3:00 PM IST

cbi-is-conducting-a-search-at-the-residence-of-ex-mp-rayapati-sambasiva-rao
మాజీ ఎంపీ రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో మాజీ ఎంపీ, తెదేపా నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్​ట్రాయ్ నిర్మాణ సంస్థ వ్యవహారాలపై సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. రాయపాటికి వాటాలున్న ఈ సంస్థపై బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ కేసు నడుస్తోంది. ఇందులో భాగంగానే రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇవాళ ఉదయం 8 గంటలకు దర్యాప్తు సంస్థ అధికారులు రాయపాటి నివాసానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. వివిధ గదులు, ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో మాజీ ఎంపీ, తెదేపా నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్​ట్రాయ్ నిర్మాణ సంస్థ వ్యవహారాలపై సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. రాయపాటికి వాటాలున్న ఈ సంస్థపై బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ కేసు నడుస్తోంది. ఇందులో భాగంగానే రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇవాళ ఉదయం 8 గంటలకు దర్యాప్తు సంస్థ అధికారులు రాయపాటి నివాసానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. వివిధ గదులు, ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: 'నాకు అప్పగించండి.. ఆమిర్​ను రాటుదేల్చుతా'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.