హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి టాస్క్ఫోర్స్ దాడిలో రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా నిమ్మలూరి శ్రీహరి, అవూరి పాండరిపై అనుమానం వచ్చి సోదాలు చేశారు. వీరి వద్ద రెండు బ్యాగుల్లో ఉన్న రూ. 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. పట్టబడ్డ డబ్బు జయభేరి సంస్థకు చెందినదిగా గుర్తించారు. రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఎంపీ మురళీ మోహన్పై కూడా కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:ఎన్నికల వాయిదాకై కోర్టుకెక్కిన ఇందూరు రైతులు