ETV Bharat / state

తప్పని చెప్పినందుకు చంపేశారు!

author img

By

Published : Mar 11, 2020, 3:01 PM IST

రోడ్డుపై జరిగిన గొడవను ఆపేందుకు వెళ్తే ప్రాణాలు పోయాయి. చిన్న పంచాయితీకి పెద్దమనిషిగా వెళ్లిన వ్యక్తి విగత జీవిగా మారిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో చోటుచేసుకుంది.

car accident in rangareddy district
పంచాయతీకి పెద్దమనిషిగా వెళ్తే... ప్రాణాలు పాయే..

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్​లో చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. మర్పల్లి సమీపంలో రోడ్డుపై జరిగిన చిన్న పంచాయితీకి ఓ వ్యక్తి పెద్ద మనిషిగా వెళితే ప్రాణం పోయింది. ప్రశాంత్, సతీష్ అనే ఇద్దరు కారులో వెళుతున్నారు. ఈక్రమంలో శ్రీనాథ్​ అనే వ్యక్తి ద్విచక్రవాహనం తగిలింది. కారులోని వ్యక్తులు శ్రీనాథ్​తో ఘర్షణకు దిగారు. ఇది గమనించిన శ్రీనాథ్​ సహోద్యోగులు పరమేశ్వర్​, రాజులు ఘర్షణను నిలువరించే ప్రయత్నం చేశారు.

'మాకే నీతులు చెప్తారా' అంటూ పరమేశ్వర్​, రాజులను కారులోని వ్యక్తులు చితకబాదారు. అంతే కాకుండా బలవంతంగా కారు ఎక్కించుకున్నారు. కొద్దిదూరంలోనే ఆ కారు బోల్తా పడగా... పరమేశ్వర్​ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. నిందితులు ప్రశాంత్​, సతీష్​లు కారును అక్కడే వదిలి పరారయ్యారు. సతీశ్​, ప్రశాంత్​లు పాత నేరస్థులేనని... నిన్న ఓ కేసులో కోర్టుకు హాజరైనట్లు పోలీసులు వెల్లడించారు. ఘర్షణతో సంబంధం లేని వ్యక్తి మరణంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రశాంత్​ను​ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పంచాయతీకి పెద్దమనిషిగా వెళ్తే... ప్రాణాలు పాయే..

ఇవీ చూడండి: సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం... ఒకరి అరెస్ట్​

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్​లో చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. మర్పల్లి సమీపంలో రోడ్డుపై జరిగిన చిన్న పంచాయితీకి ఓ వ్యక్తి పెద్ద మనిషిగా వెళితే ప్రాణం పోయింది. ప్రశాంత్, సతీష్ అనే ఇద్దరు కారులో వెళుతున్నారు. ఈక్రమంలో శ్రీనాథ్​ అనే వ్యక్తి ద్విచక్రవాహనం తగిలింది. కారులోని వ్యక్తులు శ్రీనాథ్​తో ఘర్షణకు దిగారు. ఇది గమనించిన శ్రీనాథ్​ సహోద్యోగులు పరమేశ్వర్​, రాజులు ఘర్షణను నిలువరించే ప్రయత్నం చేశారు.

'మాకే నీతులు చెప్తారా' అంటూ పరమేశ్వర్​, రాజులను కారులోని వ్యక్తులు చితకబాదారు. అంతే కాకుండా బలవంతంగా కారు ఎక్కించుకున్నారు. కొద్దిదూరంలోనే ఆ కారు బోల్తా పడగా... పరమేశ్వర్​ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. నిందితులు ప్రశాంత్​, సతీష్​లు కారును అక్కడే వదిలి పరారయ్యారు. సతీశ్​, ప్రశాంత్​లు పాత నేరస్థులేనని... నిన్న ఓ కేసులో కోర్టుకు హాజరైనట్లు పోలీసులు వెల్లడించారు. ఘర్షణతో సంబంధం లేని వ్యక్తి మరణంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రశాంత్​ను​ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పంచాయతీకి పెద్దమనిషిగా వెళ్తే... ప్రాణాలు పాయే..

ఇవీ చూడండి: సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం... ఒకరి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.