కరోనా వంటి ఆపత్కర సమయంలో విధులు నిర్వహిస్తోన్న వారికి రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారని హైదరాబాద్ తార్నాక డివిజన్ కార్పొరేటర్ పాలకొండ సరస్వతి హరి అన్నారు. 150 మంది జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బందికి దాతల సాయంతో ప్రతిరోజు అల్పాహారాన్ని అందజేస్తున్నారు.
ఈ ఆపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సామాజిక సృహతో పనిచేయాలని కోరారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండి భౌతిక దూరం పాటించాలని సూచించారు.